Don't Miss!
- News నన్ను చంపేస్తామని బెదిరిస్తున్నారు, మంత్రి సంచలన వ్యాఖ్యలు, ఇది వాళ్లపనే అని నాకు తెలుసు !
- Sports IPL 2024: రెండుగా చీలిన ముంబై ఇండియన్స్.. హార్దిక్ మాట వినని రోహిత్ గ్రూప్!
- Automobiles నితిన్ గడ్కరీ కీలక ప్రకటన.. వాహనదారులు తప్పక తెలుసుకోవాల్సిందే!
- Technology X ప్లాట్ఫాం ప్రీమియం ఫీచర్లను ఉచితంగా వినియోగించుకోవచ్చు.. వారికి మాత్రమేనని ఎలాన్ మస్క్ ప్రకటన!!
- Lifestyle First Surya Grahan: ఏప్రిల్ నెలలో మొదటి సూర్య గ్రహణం ఎప్పుడు? సూతక కాలం
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
‘పుష్ప’ ఇలాకాలోకి ‘ఆచార్య’: అందులోకి ఎంట్రీ ఇవ్వబోతున్న మెగా పవర్ స్టార్
టాలీవుడ్ టాప్ హీరో మెగాస్టార్ చిరంజీవి - బడా డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్లో వస్తోన్న చిత్రం 'ఆచార్య'. కొణిదెల ప్రొడక్షన్స్, మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్లపై నిరంజన్ రెడ్డి, రామ్ చరణ్ దీన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ హీరోయిన్గా చేస్తోన్న ఈ సినిమాకు మణిశర్మ సంగీతం సమకూర్చుతున్నాడు. ఇందులో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా కీలక పాత్రను పోషిస్తున్నాడు. భారీ బడ్జెట్తో రూపొందుతోన్న ఈ సినిమాపై అంచనాలు అదే రీతిలో ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఈ 'ఆచార్య'.. అల్లు అర్జున్ 'పుష్ప' ఇలాకాలోకి వెళ్తున్నాడు.
Recommended Video
'ఆచార్య' మూవీ షూటింగ్ హైదరాబాద్లో వేసిన ధర్మస్థలి టెంపుల్ టౌన్ సెట్లో జరిగిన విషయం తెలిసిందే. ఇప్పుడు రామ్ చరణ్కు సంబంధించిన సన్నివేశాల చిత్రీకరణ మాత్రం తూర్పు గోదావరి జిల్లా మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో జరగబోతుంది. ఇందులో నక్సలైట్గా నటిస్తోన్న చరణ్పై కొన్ని యాక్షన్ సన్నివేశాలు చిత్రీకరించబోతున్నారు. దాదాపు ఇరవై రోజుల పాటు జరిగే ఈ షెడ్యూల్ కోసం చిత్ర యూనిట్ ఇప్పటికే అక్కడకు బయలుదేరినట్లు తెలుస్తోంది. మెగా పవర్ స్టార్ కూడా ఆ ప్రాంతానికి చేరుకోబోతున్నాడని అంటున్నారు. ఇక్కడే ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ తెలిసింది.
సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ నటిస్తోన్న చిత్రం 'పుష్ప'. ఈ మూవీ షూటింగ్ తూర్పు గోదావరి జిల్లా మారేడుమిల్లి, రంపచోడవరం అటవీ ప్రాంతంలో జరిగింది. దీని కోసం అక్కడ ప్రత్యేకమైన సెట్తో పాటు గెస్ట్ హౌస్ కూడా నిర్మించుకున్నారు. ఇప్పుడదే ప్లేస్కు 'ఆచార్య' టీమ్ వెళుతోంది. 'పుష్ప' సెట్లోనే ఈ మూవీ షూటింగ్ జరగబోతుంది. అంతేకాదు, ఆ గెస్టు హౌస్లోనే రామ్ చరణ్ బస చేయబోతున్నాడని తెలుస్తోంది. దీని వల్ల కొంత ఖర్చు కూడా తగ్గినట్లు ప్రచారం జరుగుతోంది. మొత్తానికి ఇద్దరు మెగా హీరోలు ఒకే చోట షూటింగ్ జరుపుకుంటున్నారన్న మాట.