twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ‘పుష్ప’ ఇలాకాలోకి ‘ఆచార్య’: అందులోకి ఎంట్రీ ఇవ్వబోతున్న మెగా పవర్ స్టార్

    |

    టాలీవుడ్ టాప్ హీరో మెగాస్టార్ చిరంజీవి - బడా డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్‌లో వస్తోన్న చిత్రం 'ఆచార్య'. కొణిదెల ప్రొడక్షన్స్, మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్లపై నిరంజన్ రెడ్డి, రామ్ చరణ్ దీన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా చేస్తోన్న ఈ సినిమాకు మణిశర్మ సంగీతం సమకూర్చుతున్నాడు. ఇందులో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా కీలక పాత్రను పోషిస్తున్నాడు. భారీ బడ్జెట్‌తో రూపొందుతోన్న ఈ సినిమాపై అంచనాలు అదే రీతిలో ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఈ 'ఆచార్య'.. అల్లు అర్జున్ 'పుష్ప' ఇలాకాలోకి వెళ్తున్నాడు.

    Recommended Video

    Chiranjeevi స్టామినా కి టెస్టింగ్ టైమ్ | Acharya Unanimous టాక్ తెచ్చుకోవాలి!!

    'ఆచార్య' మూవీ షూటింగ్ హైదరాబాద్‌లో వేసిన ధర్మస్థలి టెంపుల్ టౌన్‌ సెట్‌లో జరిగిన విషయం తెలిసిందే. ఇప్పుడు రామ్ చరణ్‌కు సంబంధించిన సన్నివేశాల చిత్రీకరణ మాత్రం తూర్పు గోదావరి జిల్లా మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో జరగబోతుంది. ఇందులో నక్సలైట్‌గా నటిస్తోన్న చరణ్‌పై కొన్ని యాక్షన్ సన్నివేశాలు చిత్రీకరించబోతున్నారు. దాదాపు ఇరవై రోజుల పాటు జరిగే ఈ షెడ్యూల్‌ కోసం చిత్ర యూనిట్ ఇప్పటికే అక్కడకు బయలుదేరినట్లు తెలుస్తోంది. మెగా పవర్ స్టార్ కూడా ఆ ప్రాంతానికి చేరుకోబోతున్నాడని అంటున్నారు. ఇక్కడే ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ తెలిసింది.

    Acharya Team went Pushpa Sets

    సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ నటిస్తోన్న చిత్రం 'పుష్ప'. ఈ మూవీ షూటింగ్ తూర్పు గోదావరి జిల్లా మారేడుమిల్లి, రంపచోడవరం అటవీ ప్రాంతంలో జరిగింది. దీని కోసం అక్కడ ప్రత్యేకమైన సెట్‌తో పాటు గెస్ట్ హౌస్ కూడా నిర్మించుకున్నారు. ఇప్పుడదే ప్లేస్‌కు 'ఆచార్య' టీమ్ వెళుతోంది. 'పుష్ప' సెట్‌లోనే ఈ మూవీ షూటింగ్ జరగబోతుంది. అంతేకాదు, ఆ గెస్టు హౌస్‌లోనే రామ్ చరణ్ బస చేయబోతున్నాడని తెలుస్తోంది. దీని వల్ల కొంత ఖర్చు కూడా తగ్గినట్లు ప్రచారం జరుగుతోంది. మొత్తానికి ఇద్దరు మెగా హీరోలు ఒకే చోట షూటింగ్ జరుపుకుంటున్నారన్న మాట.

    English summary
    Acharya is an upcoming Indian Telugu-language action drama film directed by Koratala Siva and produced by Ram Charan and Niranjan Reddy under the Konidela Production Company and Matinee Entertainments banners. The film stars Chiranjeevi and Kajal Aggarwal while Charan is set to play a crucial role.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X