Don't Miss!
- News AP Elections: నా కాళ్లు పట్టుకున్నావా లేదా ? పెద్దిరెడ్డికి కిరణ్ ఘాటు కౌంటర్.. !
- Finance Cerelac News: పేదదేశాల సెరెలాక్ ఉత్పత్తులో పంచదార..!! FSSAIకి నోటీసులు జారీ..
- Technology గూగుల్ మ్యాప్స్ కొత్త ఫీచర్ గురించి తెలుసా.. రోడ్ ట్రిప్ సహా ప్రయాణాల్లో ఆందోళన ఉండదిక...!
- Sports చెన్నై సూపర్ కింగ్స్లో భారీ మార్పులు..!!
- Automobiles కేవలం రూ. 8,999లకే డ్యాష్క్యామ్.. ఈ BIS కెమెరా కార్లకు పెట్టుకుంటే చాలు!!
- Lifestyle గుడ్నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
లాక్ డౌన్ మళ్లీ పొడిగిస్తే.. తన గతి చిప్ప కూడే అంటోన్న బ్రహ్మాజీ
రోనా వైరస్ రోజురోజుకూ విస్తరిస్తూనే ఉంది. మన దేశంలో కరోనా తాండవం చేస్తూ దాని ప్రభావాన్ని పెంచుకుంటూ పోతోంది. ఇప్పటికే 70వేలకు పైగా కరోనా కేసులు నమోదు కాగా.. దాదాపు మూడు వేలకు పైగా మరణాలు సంభవించాయి. కరోనా కట్టడికి లాక్ డౌన్ విధించినా అంతగా ప్రయోజనం లేకుండా పోయింది. ఇప్పటికే మూడు దశల్లో లాక్ డౌన్ విధించారు. మూడో దశ లాక్ డౌన్ మే 17న ముగియనుంది.
ప్రధాని మోడీ మాట్లాడుతూ.. మే 17 తరువాత కూడా లాక్ డౌన్ కొనసాగించబోతోన్నట్టు సంకేతాలు ఇచ్చారు. అయితే ఈ మేరకు ఇప్పటికే ఉన్న సడలింపులు కాకుండా మరికొన్ని నిబంధనలతో లాక్ డౌన్ 4ను విధించబోతోన్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే లాక్ డౌన్ వల్ల దేశ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోయింది. దినసరి కూలీలు, వలస కార్మికుల దీనావస్థ గురించి రోజుకో రకమైన వార్తలు దిగ్భ్రాంతికి గురి చేస్తున్నాయి.
మూడో దశ లాక్ డౌన్లో ఇచ్చిన సడలింపులపై ప్రజల్లో కొంత వ్యతిరేకత ఏర్పడినా.. ప్రభుత్వాలు మాత్రం వెనక్కి తగ్గడం లేదు. కొన్ని చోట్ల ప్రభుత్వ రవాణా కూడా ప్రారంభమయ్యాయి. అయితే లాక్ డౌన్లో నాల్గో దశ ప్రారంభం కానుండటంతో.. నటుడు బ్రహ్మాజీ ఆసక్తికర కామెంట్స్ చేశాడు. సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే బ్రహ్మాజీ అందరిపై సెటైర్స్ వేస్తుంటాడు. తాజాగా లాక్ డౌన్ పొడిగింపుపై కౌంటర్ వేశాడు. ఒకవేళ లాక్ డౌన్ మళ్లీ పొడిగిస్తే తన గతి ఏంటో అని ఓ ఫోటోను షేర్ చేశాడు. ఆ ఫోటోలో ఓ చిప్పను, కుక్కను పట్టుకుని వెరైటీగా పోజ్ పెట్టాడు.