Don't Miss!
- Automobiles ఇలా చేయడం కరెక్టేనా? తప్పో.. ఒప్పో మీరే చెప్పాలి - వీడియో
- News తండ్రైన ముఖ్యమంత్రి: తొలి నేతగా రికార్డ్
- Technology 6.67 అంగుళాల డిస్ప్లే, ట్రిపుల్ కెమెరాతో వివో కొత్త ఫోన్... లాంచ్, స్పెసిఫికేషన్ల వివరాలు..!
- Sports IPL 2024: రెండుగా చీలిన ముంబై ఇండియన్స్.. హార్దిక్ మాట వినని రోహిత్ గ్రూప్!
- Lifestyle First Surya Grahan: ఏప్రిల్ నెలలో మొదటి సూర్య గ్రహణం ఎప్పుడు? సూతక కాలం
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
'జగన్ గారూ'.. ప్లీజ్ టేక్ యాక్షన్ సార్...బ్రహ్మాజీ రిక్వెస్ట్!
ప్రస్తుతం దేశవ్యాప్తంగా కరోనా పరిస్థితులు దారుణంగా మారుతున్నాయి. రోజురోజుకు లక్షల సంఖ్యలో కేసులు నమోదు అవుతూ ఉండడమే కాక మరణాల సంఖ్య కూడా భారీగా పెరిగి పోతూ ఉండటం ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటికే చాలా రాష్ట్రాలు లాక్ డౌన్ దిశగా పయనిస్తూ ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రంలో నైట్ కర్ఫ్యూ విధించగా ఆంధ్రప్రదేశ్ లో మధ్యాహ్నం 12 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూ అమలు చేస్తున్నారు. అయితే తాజాగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ను సీనియర్ నటుడు బ్రహ్మాజీ ఒక రిక్వెస్ట్ చేశారు. అసలు విషయం ఏమిటంటే నిన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కరోనా పరిస్థితుల మీద సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కరోనా కోసం కొన్ని ప్రత్యేక ఆస్పత్రులను సిద్ధం చేసిందని చెప్పుకొచ్చారు.. ఇవి కాక ఆరోగ్య శ్రీ కింద చికిత్స అందిస్తున్న హాస్పిటల్స్ సైతం కరోనా కోసం ఉచితంగా వైద్య సహాయం అందించాలని ఆదేశించారు. ఇవి కాకుండా వేరే ఇతర ప్రైవేట్ హాస్పిటల్స్ లో కూడా కరోనా ట్రీట్మెంట్ అందిస్తే దానికి ఒక రేట్ కార్డ్ ఫిక్స్ చేశామని ఆ రేట్ కార్డ్ వరకు చార్జీలు వసూలు చేస్తూ హాస్పిటల్స్ సేవా దృక్పథంతో ముందుకు వెళ్లాలని కోరారు.. ఒకవేళ ఏదైనా హాస్పిటల్ రేట్ కార్డ్ ని మించి డబ్బు వసూలు చేస్తూ ప్రజలను దోపిడీకి గురి చేస్తూ ఉంటే కచ్చితంగా హాస్పిటల్ మీద చర్యలు తీసుకోవాలని ఆయన అధికారులకు ఆదేశించారు..
అప్పటికప్పుడు హాస్పిటల్ అనుమతులు రద్దు చేసి హాస్పిటల్స్ ని సీజ్ చేయడానికి కూడా వెనుకాడడం వద్దని జగన్ ఆదేశించారు. ఈ వీడియో సోషల్ మీడియాలో పెద్దఎత్తున వైరల్ గా మారింది. ఈ వీడియోను షేర్ చేసిన నటుడు బ్రహ్మాజీ ఆల్రెడీ దోపిడీ మొదలు అయింది, దయచేసి యాక్షన్ తీసుకోండి అంటూ ముఖ్యమంత్రి జగన్ ను కోరారు. ఇక సినిమాల విషయానికి వస్తే బ్రహ్మాజీ పవన్ కళ్యాణ్ - రానా ప్రధాన పాత్రలలో రూపొందుతున్న అయ్యప్పనుమ్ కోషియం సినిమా రీమక్ లో ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు.
Already exploiting Sir..
— BRAHMAJI (@actorbrahmaji) May 6, 2021
please take action 🙏🏼@ysjagan https://t.co/HvOA6edmtc