Don't Miss!
- News రేవంత్ నన్ను జైల్లో వేస్తాడట..: కాంగ్రెస్ సర్కారుపై కేసీఆర్ నిప్పులు
- Sports DC vs GT: ఆ తప్పిదంతోనే ఓడిపోయాం: శుభ్మన్ గిల్
- Lifestyle పెళ్లైన వ్యక్తితో డేటింగా? కాస్త ముందు..వెనకా ఆలోచించండి..లేదంటే కొంప కొల్లేరే..!
- Technology OPPO Find X7 Ultra కెమెరా రివ్యూ! అద్భుతమైన ఫీచర్లతో, బెస్ట్ కెమెరా ఫోన్!
- Automobiles 323 కి.మీ రేంజ్తో ప్రీమియం ఎలక్ట్రిక్ బైక్ విడుదల.. ధర తెలిస్తే కొనేందుకు ఆలోచిస్తారు..!!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
బిజినెస్లో రూ. 9 కోట్ల మోసం: పోలీస్ స్టేషన్కు సీనియర్ నటుడు నరేశ్
వైవిధ్యమైన చిత్రాలతో, విలక్షణమైన నటనతో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును దక్కించుకున్న నటుడు నరేశ్. దాదాపు నాలుగు దశాబ్దాలుగా తెలుగు సినీ ఇండస్ట్రీలో తన మార్క్ సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తోన్న ఆయన.. వరుస చిత్రాలతో ఫుల్ బిజీగా గడుపుతున్నారు. హీరోగా ఎన్నో మరపురాని సినిమాల్లో నటించిన ఈయన.. సపోర్టింగ్ ఆర్టిస్టుగానూ మెప్పిస్తున్నారు. ఈ క్రమంలోనే ఈ మధ్య కాలంలో వస్తున్న సినిమాలన్నీంటిలోనూ నటిస్తున్నారు. అదే సమయంలో వ్యాపారాలు చేసుకుంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో నరేశ్ తాజాగా పోలీస్ స్టేషన్కు వెళ్లారు.
ప్రస్తుతం నరేశ్ వరుస సినిమాలతో బిజీగా ఉన్నప్పటికీ.. పలు రకాల బిజినెస్లు కూడా చేస్తున్నారు. ఇలాంటి సమయంలో తాజాగా ఓ కంపెనీపై ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు. కీస్టోన్ అనే కంపెనీ తనను మోసం చేసిందని పేర్కొంటూ ఈ సీనియర్ నటుడు ఆదివారం ఉదయం హైదరాబాద్ సీసీఎస్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వ్యాపార లావాదేవీల్లో ఆ కంపెనీ తనకు రూ. 9 కోట్లు బాకీ ఉందని.. దాన్ని చెల్లించమని అడిగినా వాళ్లు స్పందించడం లేదని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారాయన. అంతేకాదు, ఈ విషయంలో తనకు న్యాయం చేయాలంటూ పోలీసులను ఆశ్రయించారు.
సీనియర్ నటుడు నరేశ్ ఇచ్చిన ఫిర్యాదును స్వీకరించారు సీసీఎస్ పోలీసులు. దీనిపై విచారణ జరిపి వీలైనంత త్వరగా బాధితులకు న్యాయం చేస్తామని చెప్పినట్లు తెలుస్తోంది. ఈ కేసు విషయం బయటకు రావడంతో సినీ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అవుతోంది. ఈ ఘటనతో నరేశ్ వార్తల్లో నిలుస్తున్నారు.