Don't Miss!
- Sports Virat vs Gambhir: గంభీర్ వైపు కోపంగా చూసిన కోహ్లీ! వీడియో
- News జైల్లో చిప్పకూడే.: కేటీఆర్కు సీఎం రేవంత్ రెడ్డి స్ట్రాంగ్ కౌంటర్
- Automobiles గిఫ్ట్ అంటే అబ్బాయిలే ఇవ్వాలా.??.. పెళ్లిలో వరుడికి వధువు అదిరిపోయే బైక్ గిఫ్ట్.. వైరల్ వీడియో చూసేయండి
- Technology 32MP+32MP సెల్ఫీ కెమెరాలతో షియోమీ కొత్త స్మార్ట్ఫోన్.. స్పెసిఫికేషన్లు, ఫీచర్ల వివరాలు..!
- Lifestyle Human Brain Size రోజు రోజుకు పెరుగుతున్న మానవ మెదడు సైజు, రాబోవు కాలంలో బహుషా ఈ వ్యాధులు ఉండవకపోవచ్చు..
- Finance Shapoorji Pallonji IPO: షాపూర్జీ పల్లోంజీ గ్రూప్ నుంచి భారీ ఐపీఓ..
- Travel నహర్ఘర్ కోట దెయ్యాల కోటగా ఎందుకు మారింది? ఈ స్టోరీ తెలిస్తే ఆశ్చర్యపోతారు!
బిజినెస్లో రూ. 9 కోట్ల మోసం: పోలీస్ స్టేషన్కు సీనియర్ నటుడు నరేశ్
వైవిధ్యమైన చిత్రాలతో, విలక్షణమైన నటనతో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును దక్కించుకున్న నటుడు నరేశ్. దాదాపు నాలుగు దశాబ్దాలుగా తెలుగు సినీ ఇండస్ట్రీలో తన మార్క్ సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తోన్న ఆయన.. వరుస చిత్రాలతో ఫుల్ బిజీగా గడుపుతున్నారు. హీరోగా ఎన్నో మరపురాని సినిమాల్లో నటించిన ఈయన.. సపోర్టింగ్ ఆర్టిస్టుగానూ మెప్పిస్తున్నారు. ఈ క్రమంలోనే ఈ మధ్య కాలంలో వస్తున్న సినిమాలన్నీంటిలోనూ నటిస్తున్నారు. అదే సమయంలో వ్యాపారాలు చేసుకుంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో నరేశ్ తాజాగా పోలీస్ స్టేషన్కు వెళ్లారు.
ప్రస్తుతం నరేశ్ వరుస సినిమాలతో బిజీగా ఉన్నప్పటికీ.. పలు రకాల బిజినెస్లు కూడా చేస్తున్నారు. ఇలాంటి సమయంలో తాజాగా ఓ కంపెనీపై ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు. కీస్టోన్ అనే కంపెనీ తనను మోసం చేసిందని పేర్కొంటూ ఈ సీనియర్ నటుడు ఆదివారం ఉదయం హైదరాబాద్ సీసీఎస్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వ్యాపార లావాదేవీల్లో ఆ కంపెనీ తనకు రూ. 9 కోట్లు బాకీ ఉందని.. దాన్ని చెల్లించమని అడిగినా వాళ్లు స్పందించడం లేదని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారాయన. అంతేకాదు, ఈ విషయంలో తనకు న్యాయం చేయాలంటూ పోలీసులను ఆశ్రయించారు.
సీనియర్ నటుడు నరేశ్ ఇచ్చిన ఫిర్యాదును స్వీకరించారు సీసీఎస్ పోలీసులు. దీనిపై విచారణ జరిపి వీలైనంత త్వరగా బాధితులకు న్యాయం చేస్తామని చెప్పినట్లు తెలుస్తోంది. ఈ కేసు విషయం బయటకు రావడంతో సినీ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అవుతోంది. ఈ ఘటనతో నరేశ్ వార్తల్లో నిలుస్తున్నారు.