Don't Miss!
- Finance Just Dial Stock: జస్ట్ డయల్ స్టాక్ రికార్డుల మోత.. ఇంట్రాడేలో 13 శాతం అప్.. అదే కారణం..
- News సీఎం జగన్ యాత్ర పై నిఘా - కీలక నిర్ణయాలు..!!
- Automobiles టోల్గేట్ల వద్ద ఇకపై ఈ బోర్డులు ఉండవు.. కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
- Technology ధర రూ. 20 వేలలో, వైర్లెస్ ఛార్జింగ్ తో వచ్చే మొట్ట మొదటి ఫోన్! సేల్ ఈ రోజే! ఆఫర్ వివరాలు
- Sports IPL 2024: అంబానీ వల్ల మూడు జట్లు సర్వనాశనం!
- Lifestyle 56 ఏళ్లుగా ఎవరికీ కనిపించకుండా ఇంట్లోనే దాక్కున్న ఓ రహస్య వ్యక్తి... ఆడవాళ్లంటే వింత భయం..!
పోసాని కృష్ణమురళి, ఆయన కుటుంబానికి కరోనా పాజిటివ్.. దర్శక, నిర్మాతలు క్షమించండి అంటూ లేఖ
కోవిడ్ 19 థర్డ్ వేవ్ మొదలైందనే భయాందోళనల మధ్య నటుడు పోసాని కృష్ణమురళి కరోనా బారిన పడ్డారు. గత కొద్ది రోజులుగా ఆనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఇటీవల రోగ నిర్దారణ పరీక్షలు చేయించుకోగా ఆయన కుటుంబ సభ్యులందరికీ కరోనా పాజిటివ్ అనిత తేలింది. ప్రస్తుత పోసాని కుటుంబ సభ్యులందరూ గచ్చిబౌలిలోని ఏఐజీ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. ఈ విషయాన్ని స్వయంగా మీడియాకు వెల్లడించారు.
పోసాని మీడియాకు ప్రకటనను రిలీజ్ చేసి.. నేను, నా కుటుంబ సభ్యులందరూ కరోనా బారిన పడ్డారు. నాకు సినిమా ఆఫర్లు ఇచ్చిన నిర్మాత, దర్శకులు నన్ను క్షమించండి. నా వల్ల ఇబ్బంది జరిగితే మన్నించాలి. నాకు కరోనా రావడం వల్ల రెండు సినిమా షూటింగులు వాయిదా పడ్డాయి అని పోసాని తెలిపారు.
నా ఆరోగ్యం గురించి ఆందోళన చెందవద్దు. నేను, నా కుటుంబం త్వరగా కోలుకొని సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి వస్తాం. మీ అందరి ఆశీస్సులతో కోలుకొని త్వరలో షూటింగులో పాల్గొంటాను అని పోసాని తెలిపారు. మళ్లీ షూటింగ్ లకు హాజరవుతానని పోసాని కృష్ణమురళి ఒక ప్రకటనలో తెలిపారు.