Don't Miss!
- News Sujana Chowdary: ఎన్నికల వేళ సుజనా చౌదరికి షాక్..! రూ.500 కోట్ల రుణంపై...
- Finance Blood Bath: వారాంతంలో కుప్పకూలిన మార్కెట్లు.. బేర్స్ చేతిలో Sensex-Nifty..
- Technology Vivo V30e ఇండియా లాంచ్ తేదీ వివరాలు! లీక్ అయిన ధర, స్పెసిఫికేషన్లు
- Automobiles కేవలం రూ. 8,999లకే డ్యాష్క్యామ్.. ఈ BIS కెమెరా కార్లకు పెట్టుకుంటే చాలు!!
- Sports PBKS vs MI: అతను అసాధారణ బ్యాటింగ్తో భయపెట్టాడు: హార్దిక్ పాండ్యా
- Lifestyle గుడ్నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
సాయి పల్లవికి ప్రకాష్ రాజ్ మద్దతు.. నీతోనే ఉన్నాం అంటూ..
ఎప్పుడూ లేనివిధంగా టాలెంటెడ్ హీరోయిన్ సాయి పల్లవి ఇటీవల ఒక వివాదంలో చిక్కుకున్న విషయం తెలిసిందే. కాశ్మీర్ ఫైల్స్ సినిమా ఆధారంగా కాశ్మీర్ పండితులపై జరిగిన దాడులను అలాగే గో రక్షక దాడులను ఒకేలా పోల్చి తన అభిప్రాయాన్ని చెప్పడం వివాదాలకు తెరలేపింది. సాయి పల్లవి చేసిన వ్యాఖ్యలపై హిందు సంఘాలు కూడా తీవ్రస్థాయిలో మండిపడ్డాయి. భజరంగ్ దళ్ కూడా పోలీసులను ఆశ్రయించింది.
ప్రముఖ రాజకీయ నాయకులు కూడా సాయిపల్లవి వ్యాఖ్యలు కరెక్ట్ కాదు అని మండిపడ్డారు. వెంటనే క్షమాపణలు చెప్పి తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని లేదంటే భవిష్యత్తులో తన సినిమాలను కూడా అడ్డుకుంటామని తీవ్రంగా హెచ్చరికలు కూడా చేశారు. అయితే సాయి పల్లవిపై చేసిన కామెంట్స్ కు ఇండస్ట్రీలో చేస్తే ఎవరూ పెద్దగా స్పందించలేదు. ఇటీవల కేవలం ప్రకాష్ రాజ్ మాత్రమే ఆమెకు మద్దతు ఇస్తూ సోషల్ మీడియా ద్వారా స్పందించారు.
మానవత్వం అనేది అన్నిటికంటే ముఖ్యం అని.. సాయి పల్లవి నీతో మేము ఉన్నాము అంటూ ఆయన తనదైన శైలిలో ప్రత్యేకంగా ఒక ట్వీట్ కూడా చేశారు. ఇక ఓ వర్గం నెటిజన్లు మాత్రం ఈ విషయంపై భిన్నంగా స్పందిస్తున్నారు. కాశ్మీర్ పండితుల పై జరిపిన దాడులను అలాగే గో సంరక్షణ కోసం గో రక్షకులు జరిపిన దాడులను ఒకేలాగా ఎలా చూస్తారు అని మండిపడుతున్నారు.
అయితే ఇదే విషయంపై ఇదివరకే సాయిపల్లవి ఒక క్లారిటీ ఇచ్చింది. నేను మాట్లాడిన మాటలను చాలామంది తప్పుగా అర్థం చేసుకున్నారు అని ఒక విషయంలో రైట్ లెఫ్ట్ అని అడిగితే తాను న్యూట్రల్ అని చెప్పినట్లుగా వివరణ ఇచ్చింది. హింస మంచిది కాదు అని ఒక మనిషి ప్రాణం కన్నా ఈ ప్రపంచంలో గొప్పది ఏది ఉండదు అని ప్రాణం తీసే హక్కు ఎవరికీ లేదు అని ఒక వైద్యురాలిగా ఆలోచించి తెలియజేసినట్లు గా సాయి పల్లవి వివరణ ఇచ్చింది. ఇక తన వ్యాఖ్యల కారణంగా ఎవరైనా మనస్తాపం చెంది ఉంటే క్షమించాలని కూడా సాయి పల్లవి రీసెంట్ గా విడుదల చేసిన ఒక వీడియో ద్వారా తెలియజేసింది.