Don't Miss!
- Sports PBKS vs MI: తొండాటకు ముగింపు.. కెమెరా ముందు టాస్ కాయిన్ ఫలితం! వీడియో
- News నెల్లూరు జైలుకు జగన్ పై దాడి కేసు నిందితుడు సతీష్-14 రోజుల రిమాండ్..!
- Lifestyle గుడ్నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Technology 40 గంటలకు పైగా బ్యాటరీ బ్యాకప్, ChatGPT వాయిస్ AI సపోర్టుతో నథింగ్ ఇయర్బడ్స్ విడుదల.. సేల్ వివరాలు!
- Automobiles గొప్ప మనసు చాటుకున్న రాఘవ లారెన్స్.. దివ్యాంగులకు టీవీఎస్ స్కూటర్ల పంపిణీ
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
సాయి పల్లవికి ప్రకాష్ రాజ్ మద్దతు.. నీతోనే ఉన్నాం అంటూ..
ఎప్పుడూ లేనివిధంగా టాలెంటెడ్ హీరోయిన్ సాయి పల్లవి ఇటీవల ఒక వివాదంలో చిక్కుకున్న విషయం తెలిసిందే. కాశ్మీర్ ఫైల్స్ సినిమా ఆధారంగా కాశ్మీర్ పండితులపై జరిగిన దాడులను అలాగే గో రక్షక దాడులను ఒకేలా పోల్చి తన అభిప్రాయాన్ని చెప్పడం వివాదాలకు తెరలేపింది. సాయి పల్లవి చేసిన వ్యాఖ్యలపై హిందు సంఘాలు కూడా తీవ్రస్థాయిలో మండిపడ్డాయి. భజరంగ్ దళ్ కూడా పోలీసులను ఆశ్రయించింది.
ప్రముఖ రాజకీయ నాయకులు కూడా సాయిపల్లవి వ్యాఖ్యలు కరెక్ట్ కాదు అని మండిపడ్డారు. వెంటనే క్షమాపణలు చెప్పి తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని లేదంటే భవిష్యత్తులో తన సినిమాలను కూడా అడ్డుకుంటామని తీవ్రంగా హెచ్చరికలు కూడా చేశారు. అయితే సాయి పల్లవిపై చేసిన కామెంట్స్ కు ఇండస్ట్రీలో చేస్తే ఎవరూ పెద్దగా స్పందించలేదు. ఇటీవల కేవలం ప్రకాష్ రాజ్ మాత్రమే ఆమెకు మద్దతు ఇస్తూ సోషల్ మీడియా ద్వారా స్పందించారు.
మానవత్వం అనేది అన్నిటికంటే ముఖ్యం అని.. సాయి పల్లవి నీతో మేము ఉన్నాము అంటూ ఆయన తనదైన శైలిలో ప్రత్యేకంగా ఒక ట్వీట్ కూడా చేశారు. ఇక ఓ వర్గం నెటిజన్లు మాత్రం ఈ విషయంపై భిన్నంగా స్పందిస్తున్నారు. కాశ్మీర్ పండితుల పై జరిపిన దాడులను అలాగే గో సంరక్షణ కోసం గో రక్షకులు జరిపిన దాడులను ఒకేలాగా ఎలా చూస్తారు అని మండిపడుతున్నారు.
అయితే ఇదే విషయంపై ఇదివరకే సాయిపల్లవి ఒక క్లారిటీ ఇచ్చింది. నేను మాట్లాడిన మాటలను చాలామంది తప్పుగా అర్థం చేసుకున్నారు అని ఒక విషయంలో రైట్ లెఫ్ట్ అని అడిగితే తాను న్యూట్రల్ అని చెప్పినట్లుగా వివరణ ఇచ్చింది. హింస మంచిది కాదు అని ఒక మనిషి ప్రాణం కన్నా ఈ ప్రపంచంలో గొప్పది ఏది ఉండదు అని ప్రాణం తీసే హక్కు ఎవరికీ లేదు అని ఒక వైద్యురాలిగా ఆలోచించి తెలియజేసినట్లు గా సాయి పల్లవి వివరణ ఇచ్చింది. ఇక తన వ్యాఖ్యల కారణంగా ఎవరైనా మనస్తాపం చెంది ఉంటే క్షమించాలని కూడా సాయి పల్లవి రీసెంట్ గా విడుదల చేసిన ఒక వీడియో ద్వారా తెలియజేసింది.