Don't Miss!
- News కవిత అరెస్టుపై స్పందించిన కేసీఆర్: ఏమన్నారంటే?
- Sports PBKS vs MI: తొండాటకు ముగింపు.. కెమెరా ముందు టాస్ కాయిన్ ఫలితం! వీడియో
- Lifestyle గుడ్నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Technology 40 గంటలకు పైగా బ్యాటరీ బ్యాకప్, ChatGPT వాయిస్ AI సపోర్టుతో నథింగ్ ఇయర్బడ్స్ విడుదల.. సేల్ వివరాలు!
- Automobiles గొప్ప మనసు చాటుకున్న రాఘవ లారెన్స్.. దివ్యాంగులకు టీవీఎస్ స్కూటర్ల పంపిణీ
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
కరోనా కోసం కదిలొచ్చిన రాజశేఖర్ కుమార్తెలు.. బర్త్ డే సందర్భంగా సీఎం సహాయనిధికి విరాళం
తెలంగాణ ముఖ్యమంత్రి సహాయనిధికి రాజశేఖర్ కుమార్తెలు విరాళం అందించారు. ప్రస్తుతం టాలీవుడ్ లో హీరోయిన్స్ గా అడుగులు వేస్తున్న వీరు కెరీర్ మొదట్లోనే వారి ఉదారతను చాటుకున్నారు. దొరసాని సినిమాతో రాజశేఖర్ రెండవ కుమార్తె శివాత్మిక హీరోయిన్ గా పరిచయమైన విషయం తెలిసిందే. ఆమె ఒక లక్ష రూపాయలను సీఎం సహాయనిధికి అందించారు.
రాజశేఖర్ పెద్ద కుమార్తె శివాని రాజశేఖర్ కూడా మరో లక్ష రూపాయల విరాళం ప్రకటించారు. నేడు ఏప్రిల్ 22 శివాత్మిక రాజశేఖర్ పుట్టినరోజు కావడంతో ఇద్దరు సోదరీమణులు కలిసి తెలంగాణ ఐటి శాఖ మంత్రితో సమావేశమయ్యారు. ఇద్దరు వారి విరాళానికి సంబంధించిన చెక్స్ ని మాంత్రి కేటీఆర్ కి అందజేశారు. ఈ సమావేశంలో సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ కూడా ఉన్నారు.
ఈ సందర్భంగా శివాని రాజశేఖర్, శివాత్మిక రాజశేఖర్ వారి మాటలతో కూడా అందరి మనసులను గెలుచుకున్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా నియంత్రణకు తీసుకుంటున్న చర్యల గురించి పాజిటివ్ గా స్పందించారు. తమవంతుగా సహాయం చేయాలని నేడు ఈ విధంగా మీ ముందుకొచ్చాం అంటూ.. ప్రజలందరూ ఇళ్ళల్లోనే ఉంటూ ప్రభుత్వ ఆదేశాలను పాటించాలని,స్టే హోమ్. స్టే సేఫ్" అని వివరణ ఇచ్చారు.