Don't Miss!
- News వైసీపీకి బీఆర్ఎస్ గతే: గంటా శ్రీనివాసరావు సంచనల వ్యాఖ్యలు
- Sports LSG vs CSK: రప్ఫాడించిన రాహుల్... లక్నో ఘన విజయం
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
మళ్ళీ లైన్లోకి సోనూ.. కరోనా పేషెంట్ ను నాగపూర్ నుంచి చార్టర్డ్ ఫ్లైట్ లో హైదరాబాద్ కి ఎయిర్ లిఫ్ట్ !
కరోనా దేశంలోకి ఎంటర్ కాక ముందు వరకు సోనూసూద్ ఒక నటుడిగా అందులోనూ ఎక్కువగా విలన్ పాత్రలు పోషించే నటుడిగానే అందరికీ తెలుసు. కానీ ఎప్పుడైతే కరోనా లాక్ డౌన్ మొదలైందో అప్పటి నుంచి ఆయన జనానికి సేవ చేస్తూ రియల్ హీరోగా మారిపోయాడు.. తర్వాత కోవిడ్ పరిస్థితి కాస్త కుదుట పడినా సరే ఆయన తన సేవా కార్యక్రమాలు ఏమాత్రం తగ్గించకుండా ప్రజలకు కష్టం అంటే తానున్నానంటూ అండగా నిలుస్తున్నారు. తాజాగా ఆయన ఒక కరోనా రోగిని ప్రత్యేక చికిత్స కోసం నాగపూర్ నుండి హైదరాబాద్ కు ప్రత్యేక చార్టెడ్ ఫ్లైట్ లో పంపించడం చర్చనీయాంశంగా మారింది. మహారాష్ట్రలోని నాగపూర్ కు చెందిన భారతి అనే రోగి దాదాపు 80 90 శాతం ఊపిరితిత్తులను కోల్పోయింది..
దీంతో సోనూసూద్ ఆమెను నాగపూర్లోని వోక్ హార్ట్ ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. అయితే ఆమె ఊపిరితిత్తులను మార్చాలి లేదా ప్రత్యేక శస్త్రచికిత్స చేసి చికిత్స చేయాలని అక్కడి వైద్యులు తెలిపారు. అయితే అలాంటి సదుపాయాలు తమ వద్ద లేవని దగ్గరలో అంటే కేవలం హైదరాబాద్ అపోలో ఆసుపత్రిలో మాత్రమే అలాంటి చికిత్స చేసే సదుపాయం ఉందని వైద్యులు తేల్చి చెప్పారు. దీంతో వెంటనే అపోలో హాస్పిటల్ యాజమాన్యంతో చర్చలు జరిపిన సోనూసూద్ వెంటనే ఆమెను ఎయిర్ అంబులెన్స్ ద్వారా హైదరాబాద్ కు పంపించారు..
ఇక ఎక్మో అని పిలవబడే ఒక ప్రత్యేక చికిత్సతో కృత్రిమంగా రక్తం పంప్ చేయడం వల్ల ఊపిరితిత్తుల మీద పడిన ఒత్తిడిని తొలగించవచ్చని డాక్టర్ లు చెబుతున్నారు. నిజానికి ఈ చికిత్స చేయాలంటే హైదరాబాద్ నుంచి ప్రత్యేక వైద్య బృందం నాగపూర్ వెళ్లాల్సి ఉంటుంది. అంత మంది వైద్యులను ఈ సమయంలో నాగపూర్ పంపడం కంటే అన్ని సదుపాయాలు ఉండి,ప్రపంచ స్థాయి వైద్యం అందించే అపోలో హాస్పిటల్ కి తరలించడం సరైన నిర్ణయం భావించి అప్పటికప్పుడు ఎయిర్ అంబులెన్స్ సిద్ధం చేయించి పంపించినట్లు సమాచారం. ప్రస్తుతానికి భారతి హైదరాబాద్ లోని అపోలో హాస్పిటల్ లో చికిత్స పొందుతోంది.