Don't Miss!
- Automobiles రూ.5 లక్షల కంటే తక్కువ ధరలో బైక్ కావాలా.. ఇక్కడ చూడండి
- Finance EPFO: మీకు పీఎఫ్ ఖాతా ఉందా.. అయితే ఈ పని చేయండి..!
- News రఘురామకు సీటు పై కసరత్తు - కీలక ప్రతిపాదన, ఖాయమయ్యేనా..!!
- Technology ధర రూ.17999 కే 108MP కెమెరా, 6000mAh బ్యాటరీ, 6.78 అంగుళాల డిస్ప్లే 5G స్మార్ట్ఫోన్..!!
- Lifestyle సమ్మర్ బ్లాక్ బస్టర్ రిసిపి మ్యాంగో చికెన్ కర్రీ..!ఒక్కసారి రుచి చూస్తే మళ్లీ మళ్లీ తినాలనిపిస్తుంది
- Sports తలతిక్క నిర్ణయాలు: ఆ టీమ్కు అసలు సెన్స్ ఉందా: మాజీ లెజెండ్ ఫైర్
- Travel గుడ్ప్రైడే రోజున లాంగ్వీకెండ్ ప్లాన్ చేస్తున్నారా? అయితే ఈ ప్లేస్లు చూసేయండి...
తిట్లు, చివాట్లు, వేల అవతారాలు… డైరెక్టర్ గా మారిన నటుడు ఆసక్తికర వ్యాఖ్యలు!
నటులు దర్శకులు గా మారిన దాఖలాలు టాలీవుడ్ లో ఎక్కువనే చెప్పాలి. మరీ ముఖ్యంగా హీరోలుగా రాణించిన ఎంతో మంది నటులు తర్వాత కాలంలో దర్శకుడిగా మారి తమ లక్ పరీక్షించుకున్నారు. అయితే కేవలం మూడు నాలుగు సినిమాల్లో నటించిన అనుభవం ఉన్న ఒక నటుడు ఇప్పుడు దర్శకుడిగా మారిన అంశం ఆసక్తికరంగా మారింది. ఆ వివరాల్లోకి వెళితే
అభిషేక్ మహర్షి
అభిషేక్ మహర్షి, ఈ పేరు యూట్యూబ్ లో లో ఉన్న వారికి కాస్త పరిచయమే. ఎందుకంటే నటుడిగానే కాక కొన్ని ఇంటర్వ్యూలలో కూడా ఆయన యాంకర్ గా వ్యవహరించాడు. అలా అలా మొత్తం మీద ఆయన ఎనిమిది సినిమాల్లో నటించి గుర్తింపు తెచ్చుకున్నాడు. కేవలం సినిమాల్లోనే కాక యూట్యూబ్ లో కూడా ఆయన దాదాపు అందరికీ పరిచయమే అనే చెప్పాలి.
ఎనిమిది సినిమాల్లో నటించి
తెలుగులో నందు హీరోగా వచ్చిన బెస్ట్ యాక్టర్ అనే సినిమా ద్వారా నటుడిగా పరిచయమైన ఆయన తర్వాత నాని హీరోగా వచ్చిన భలే భలే మగాడివోయ్, తను నేను, పైరేట్స్ 1.0, ఆ తర్వాత అజ్ఞాతవాసి, పేపర్ బాయ్, జెస్సి, మహేష్ బాబు మహర్షి సినిమాలో నటించాడు. అయితే గత కొన్ని ఏళ్లుగా దర్శకత్వం చేయాలని ప్రయత్నాలు చేస్తున్న అభిషేక మహర్షికి ఎట్టకేలకు కాలం కలిసి రావడంతో ఆయన దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు.
సంతోష్ శోభన్ తో
తను
నేను
సినిమాలో
హీరోగా
నటించిన
సంతోష్
శోభన్
ఈ
మధ్య
కాలంలోనే
ఏక్
మినీ
కథ
సినిమాతో
ప్రేక్షకుల
ముందుకు
వచ్చాడు.
వీరిద్దరూ
కలిసి
తను
నేను
సినిమా
చేసినప్పటి
పరిచయంతో
కథ
చెప్పి
ఫైనల్
చేయించుకో
గలిగాడు
అభిషేక్
మహర్షి.
ఈ
సినిమా
ప్రకటన
కూడా
ఈ
రోజు
వెలువడింది.
అయితే
సినిమా
ప్రకటన
సందర్భంగా
ఆయన
చేసిన
కొన్ని
కామెంట్స్
ఇప్పుడు
ఆసక్తికరంగా
మారాయి.
తిట్లు, చివాట్లు, వేల అవతారాలు
''ఎన్నో నిద్ర లేని రాత్రులు, కలలు, తిట్లు, చివాట్లు, భుజం మీద తట్టి ఇచ్చినా ప్రశంసలు, గమ్యం చేరడం కోసం చేసినా బోలెడన్ని పనులు, బతకడం కోసం ఎత్తిన వేల అవతారాలు, ఫలించని ప్రయత్నాలు, గుర్తింపులేని కష్టం, అవమానాలు వీటన్నిటిలో పక్కనే నుంచొని మేమున్నామని నా వాళ్ళు ఇచ్చినా భరోసా కలిసి నా ఈ మొదటి చలన చిత్రం ప్రేమ్ కుమార్. నన్ను నమ్మిన కొందరికి, నమ్మని చాలా మందికి ధన్యవాదాలు'' అంటూ ఆయన రాసుకొచ్చారు.
Recommended Video
80 శాతం షూట్ పూర్తి
రాశీ సింగ్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో కృష్ణ చైతన్య, రుచిత సాధినేని, కృష్ణతేజ, సుదర్శన్, అశోక్ కుమార్, ప్రభావతి, మధు కూడా నటిస్తున్నారు. ఆల్రెడీ 80 శాతం షూట్ కూడా పూర్తయిన ఈ సినిమా మిగతా షూట్ లాక్డౌన్ తర్వాత పూర్తి చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.