Don't Miss!
- Finance HUL: రూ.24 డివిడెండ్ ప్రకటించిన హిందుస్థాన్ యూనిలీవర్..
- News వివేకా కేసులో మరో అనూహ్య ట్విస్ట్- విచారణ నుంచి తప్పుకున్న జడ్జి..!
- Automobiles కొత్త ఆస్టన్ మార్టిన్ వాంటేజ్ కూల్ స్పోర్ట్స్ కారు లాంచ్.. గంటకు 325 కి.మీ వేగం.. ధర, ఫీచర్లు ఇవే..
- Technology Nokia మాతృ సంస్థ HMD నుంచి మూడు కొత్త ఫోన్లు లాంచ్! ధర, స్పెసిఫికేషన్ల వివరాలు
- Sports సూపర్మ్యాన్ స్టబ్స్: మెరుపు ఫీల్డింగ్తో ఢిల్లీని గెలిపించాడు! Video
- Lifestyle పెళ్లైన వ్యక్తితో డేటింగా? కాస్త ముందు..వెనకా ఆలోచించండి..లేదంటే కొంప కొల్లేరే..!
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
రేఖ ఇంట్లో కరోనావైరస్.. బంగ్లాను సీజ్ చేసిన అధికారులు
బాలీవుడ్ సూపర్స్టార్ అమితాబ్ బచ్చన్కు కరోనావైరస్ వార్త బయటకు వచ్చిన కొద్ది సేపటికే సీనియర్ నటి రేఖ ఇంటిలో కరోనావైరస్ వార్త బయటపడింది. రేఖ కరోనావైరస్ బారిన పడకపోవడం ఊరట కలిగించే విషయం కాగా, ఆమె బాడీగార్డులకు కోవిడ్ పాజిటివ్ అని తేలినందున ఆమె బంగ్లాను ముంబై మున్సిపల్ అధికారులు సీజ్ చేశారు.
రేఖ బాడీగార్డులకు శుక్రవారమే కరోనావైరస్ పాజిటివ్ అని తేలడంతో శనివారం అధికారులకు సమాచారం అందించారు. రేఖ అందించిన సమాచారం మేరకు ఆమె ఇంటిని సీజ్ చేసి స్వాధీన పర్చుకొన్నారు.
ముంబైలోని బాంద్రాలో ఉన్న బ్యాండ్స్టాండ్ ప్రాంతంలోని సీ స్ప్రింగ్స్ బంగ్లాను బీఎంసీ అధికారులు సీజ్ చేవారు. ఆ ప్రాంతాన్ని కంటైన్మెంట్ ప్రాంతంగా ప్రకటించారు. ఆమె బంగ్లా ముందు నోటీస్ అతికించారు. ఆ ప్రాంతాన్ని శనివారం శానిటైజ్ చేసి శుభ్రపరిచారు. అయితే రేఖ నుంచి గానీ, ఆమె వ్యక్తిగత సిబ్బంది నుంచి గానీ ఎలాంటి అధికార ప్రకటన రాకపోవడం గమనార్హం.