Don't Miss!
- News కవితకు బెయిల్ కోసం నిరీక్షణ తప్పదు; ఈడీ కేసులోనూ తీర్పు రిజర్వ్!!
- Sports IPL 2024: రుతురాజ్ గైక్వాడ్పై అంబటి రాయుడు విమర్శలు.. తప్పుబట్టిన సిక్సర్ల సిద్దు!
- Lifestyle మండిపోయే ఎండలో చల్లగా దద్దోజనాన్ని ఇలా చేసుకోండి..?
- Automobiles మరో సమస్యలో చిక్కుకున్న శిల్పా శెట్టి భర్త.. ఆ లగ్జరీ కార్లు సీజ్
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
- Technology Realme నుంచి రెండు కొత్త ఫోన్లు లాంచ్ అయ్యాయి! ధర రూ.11,999 కే మొదలు
రేఖ ఇంట్లో కరోనావైరస్.. బంగ్లాను సీజ్ చేసిన అధికారులు
బాలీవుడ్ సూపర్స్టార్ అమితాబ్ బచ్చన్కు కరోనావైరస్ వార్త బయటకు వచ్చిన కొద్ది సేపటికే సీనియర్ నటి రేఖ ఇంటిలో కరోనావైరస్ వార్త బయటపడింది. రేఖ కరోనావైరస్ బారిన పడకపోవడం ఊరట కలిగించే విషయం కాగా, ఆమె బాడీగార్డులకు కోవిడ్ పాజిటివ్ అని తేలినందున ఆమె బంగ్లాను ముంబై మున్సిపల్ అధికారులు సీజ్ చేశారు.
రేఖ బాడీగార్డులకు శుక్రవారమే కరోనావైరస్ పాజిటివ్ అని తేలడంతో శనివారం అధికారులకు సమాచారం అందించారు. రేఖ అందించిన సమాచారం మేరకు ఆమె ఇంటిని సీజ్ చేసి స్వాధీన పర్చుకొన్నారు.
ముంబైలోని బాంద్రాలో ఉన్న బ్యాండ్స్టాండ్ ప్రాంతంలోని సీ స్ప్రింగ్స్ బంగ్లాను బీఎంసీ అధికారులు సీజ్ చేవారు. ఆ ప్రాంతాన్ని కంటైన్మెంట్ ప్రాంతంగా ప్రకటించారు. ఆమె బంగ్లా ముందు నోటీస్ అతికించారు. ఆ ప్రాంతాన్ని శనివారం శానిటైజ్ చేసి శుభ్రపరిచారు. అయితే రేఖ నుంచి గానీ, ఆమె వ్యక్తిగత సిబ్బంది నుంచి గానీ ఎలాంటి అధికార ప్రకటన రాకపోవడం గమనార్హం.