twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    బుల్లితెరపై కోవిడ్ 19 ఎటాక్.. మరో టెలివిజన్ నటికి కరోనా పాజిటివ్

    |

    టెలివిజన్ యాక్టర్ శ్రేణు పారిఖ్ కరోనా బారిన పడ్డారు. తన కోవిడ్ 19 సోకిందనే విషయాన్ని తన ఇన్స్‌టాగ్రామ్ అకౌంట్ ద్వారా వెల్లడించారు. ఇష్క్‌బాజ్ సీరియల్ ద్వారా శ్రేణు బుల్లితెర ప్రేక్షకులకు చేరువైన విషయం తెలిసిందే. తన కరోనావైరస్ సోకిందనే విషయం గురించి చెబుతూ.. కొద్ది రోజల క్రితం నాకు పరీక్షలు నిర్వహించగా పాజిటివ్ అనే విషయం బయటపడింది. దాంతో నా సొంత పట్టణం వడోదరలో ఉండి ట్రీట్‌మెంట్ తీసుకొంటున్నాను అని శ్రేణు పారిఖ్ తెలిపారు.

    శ్రేణు పారిఖ్ ఓ ప్రకటనలో.. ప్రస్తుతం కరోనావైరస్ నుంచి కోలుకొంటున్నాను. అందుకు డాక్టర్లకు థ్యాంక్స్ చెప్పుకోవాలి. వారు ఎంతో సహనంతో పేషెంట్లను చూసుకోవడం జరుగుతున్నది. మీ ప్రార్థనలే నన్ను కాపాడుతాయి. కరోనాతో పోరాడుతున్న యోధులందరికి నా ధన్యవాదాలు. ఇలాంటి పరిస్థితిలో మనోధైర్యంతో ముందడుగు వేయడమే తక్షణ కర్తవ్యం అని పారిఖ్ అన్నారు.

    Actress Shrenu Parikh tested coronavirus positive

    కరోనా బారిన పడిన విషయం తెలియగానే ఆమె త్వరగా కోలుకోవాలని అభిమానులు, స్నేహితులు, సహ నటులు ప్రార్థిస్తున్నారు. ఇష్క్‌బాజ్‌లో తనతో నటించిన కునాల్ జైసింగ్‌తోపాటు హెల్లీ షా, జిగ్యాసా సింగ్, భవానీ పురోహిత్, మోనాలిసా, మన్సి శ్రీవాస్తవ, హర్ష్ రాజ్‌పుత్ సోషల్ మీడియాలో ఆమె త్వరగా కోలుకోవాలి అని మెసేజ్ చేశారు.

    ఇటీవలకాలంలో హిందీ టెలివిజన్ రంగంలో మోహెనా కుమారీ సింగ్, అదితి గుప్తా, పార్థ్ సంతాన్ తదితరులు కరోనావైరస్ బారిన పడ్డారు.

    Read more about: coronavirus
    English summary
    Isqbaaaz Actress Shrenu Parikh tested coronavirus positive. She wrote in social media that, Hey everyone, have been away for a while but the bugger hasn’t spared me… was found COVID positive a few days ago, I’m now recovering in the hospital!.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X