Don't Miss!
- News బీఆర్ఎస్కు మరో షాక్: బీజేపీలోకి బేతి సుభాష్ రెడ్డి, ఈటలకు మద్దతు
- Sports IPL:ధోనీ ఫిక్సింగ్ చేశాడా..? సీఎస్కేను రెండేళ్లు ఎందుకు బ్యాన్ చేశారు..?
- Automobiles 5 రూపాయల గొడవ.. చిర్రెత్తి సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ప్రయాణికుడు.. అసలేం జరిగిందంటే.!!
- Technology Samsung నుంచి కొత్త 8K మరియు 4K AI టీవీ లు లాంచ్ అయ్యాయి! ధర, ఫీచర్లు, ఆఫర్లు
- Lifestyle Happy Birthday Wishes : పుట్టినరోజు శుభాకాంక్షలను ఇలా అందంగా తెలపండి..
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
కేవలం రెండు రోజులే.. మనసు చంపుకుని.. సీనియర్ నటి సెన్సేషనల్ కామెంట్స్
అమ్మ పాత్రలైనా, అక్క క్యారెక్టర్స్ అయినా, వదినగా అయినా సరే ఎలాంటి పాత్రలోనైనా అవలీలగా నటించి మెప్పించగలదు సీనియర్ నటి సుధా. చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జునలకు అమ్మగా, అక్కగా, వదినగా ఇలా ఎన్నో హిట్ సినిమాల్లో నటించి ఓ మంచి గుర్తింపును తెచ్చుకుంది. తాజాగా ఆమె ఓ యూట్యూబ్ చానెల్కు ఇంటర్వ్యూ ఇస్తూ.. అనేక విషయాలను వెల్లడించింది.
మమ్మీ అని పిలుస్తాడు..
రామ్ చరణ్, మనోజ్, అల్లు అర్జున్, అల్లరి నరేష్ ఇలా అందర్నీ చిన్నప్పటి నుంచి చూశానని, వారంతా తనతో ఎంతో ప్రేమగా ఉంటారని చెప్పుకొచ్చింది. ఝుమ్మంది నాదం సినిమా సమయంలో మమ్మీ అంటూ మనోజ్ గట్టిగా అరిచాడని తెలిపింది. మేజర్ చంద్రకాంత్ సమయం నుంచి మనోజ్ తనను మమ్మీ అనే పిలుస్తాడని చెప్పుకొచ్చింది.
నాగార్జున ఫ్యామిలీ చాలా క్లోజ్..
చిరంజీవి, నాగార్జున, బాలయ్యతో చాలా క్లోజ్ అని వారితో చాలా సినిమాలు చేయడంతో వారి కుటుంబాలతో కూడా కలిసి పోయాయని చెప్పుకొచ్చింది. అందరి కంటే నాగార్జున ఫ్యామిలీతోనే తనకు ఎక్కువ దగ్గరని తెలిపింది. సుశీల, వెంకట్ బాగా తెలుసని, సుశీలతో ఫోన్లో చాలా సేపు ఫోన్ మాట్లాడతానని పేర్కొంది.
కేవలం రెండు నిమిషాలే..
తాను ఓ క్యారెక్టర్ చేస్తే అందరూ గుర్తించాలని, అలాంటి పాత్రలే చేస్తానని చెప్పుకొచ్చింది. తన పాత్ర నచ్చకపోతే ఆ క్యారెక్టర్ చేయనని ఖరాఖండిగా చెప్పేసింది. అందులో భాగంగానే శ్రీమంతుడు సినిమాను వదులుకున్నానని కూడా తెలిపింది. ఆ సినిమాలో తన పాత్ర రెండు రోజులే షూటింగ్.. రెండు నిమిషాలే ఉంటుందని చెప్పారు. అలాంటప్పుడు తానెందుక ఆ పాత్ర చేయాలని, వదులుకున్నట్లు పేర్కొంది.
మనసు చంపుకుని..
తాను ఏ పాత్ర చేసినా అది ప్రజలు గుర్తించే విధంగా ఉండాలనే కోరుకుంటానని తెలిపింది. మనసు చంపుకుని అలాంటి పాత్రలను చేయలేనని చెప్పుకొచ్చింది. ఊరికే నిల్చునే పాత్రలను తాను చేయనని పేర్కొంది.