కోల్కత్తా కాలేజ్ మెరిట్ లిస్టులో సన్నిలియోన్.. క్లాస్లో కలుద్దామంటూ ట్వీట్
బాలీవుడ్ శృంగార తార సన్నీలియోన్ మరోసారి వార్తల్లోకి ఎక్కారు. కోల్కత్తాలోని అశుతోష్ కాలేజ్ రూపొందించిన మెరిట్ జాబితాలో టాప్ స్థానంలో సన్నీలియోన్ పేరు కనిపించడంతో మీడియాలో ఆసక్తికరమైన వార్తగా మారింది. సన్నిలియోన్ పేరుతో ఉన్న విద్యార్థి 12వ తరగతి పరీక్షల్లో ఉత్తమ విద్యార్థిగా నిలిచింది. కనీసం నాలుగు సబ్జెక్టుల్లో 400 మార్కులు సాధించడంతో టాప్ ర్యాంక్ సొంతమైంది.
తన పేరుతో ఓ విద్యార్థి లిస్టులో టాప్ స్థానంలో ఉండటంపై సన్నిలియోన్ ట్విట్టర్లో స్పందించారు. వచ్చే సెమిస్టర్కు కాలేజ్కు వస్తాను. మీరు నా క్లాస్లో ఉంటారనుకొంటా అంటూ సన్నీలియోన్ చిలిపిగా ట్వీట్ చేశారు.

అయితే ఎవరో తుంటరి పిల్లలు కావాలనే సరదా కోసం సన్నీలియోన్ పేరుతో అప్లికేషన్ సమర్పించి ఉంటారు. గతేడాది కూడా బీహార్ హెల్త్ ఇంజినీరింగ్ డిపార్ట్మెంట్ నిర్వహించిన పరీక్షల్లో జూనియర్ ఇంజినీర్ పోస్టులకు రూపొందించిన జాబితాలో సన్నీలియోన్ పేరు టాప్గా కనిపించడం మీడియాలో చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే.

ఇక సన్నీలియోన్ విషయానికి వస్తే.. ప్రస్తుతం తన ఫ్యామిలీతో కలిసి లాస్ ఎంజెలెస్లో ఉన్నారు. భారత్లో లాక్డౌన్ ఎత్తివేసిన తర్వాత తన భర్త డెనియల్ వెబర్, తన పిల్లలు నిషా, నోవా, అషర్తో కలిసి లాస్ ఎంజెలెస్కు వెళ్లారు. అమెరికాలో పరిస్థితులు సురక్షితంగా ఉంటాయని భావించాను. అందుకు అమెరికాకు వెళ్లాను అని సన్నీలియోన్ చెప్పారు.


Click it and Unblock the Notifications











