Don't Miss!
- News మహానదిలో పడవ మునక: ఏడుమంది గల్లంతు
- Sports LSG vs CSK: రప్ఫాడించిన రాహుల్... లక్నో ఘన విజయం
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
టార్చర్గా ఉందా? అవమానంగా భావిస్తున్నారా? త్రిష ఆవేదన
అందాల నటి త్రిష కోవిడ్ 19 కారణంగా స్వీయ గృహ నిర్బంధంలోకి వెళ్లిపోయారు. యూనిసెఫ్కు బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరిస్తున్న ఆమె తన వంతు బాధ్యతగా ఓ వీడియోను రిలీజ్ చేసింది. కరోనావైరస్ వేగంగా విస్తరిస్తున్నందును ఆ ముప్పును తగ్గించాలని విదేశాల నుంచి ఇండియాకు వచ్చిన వారికి సూచింంచారు.
స్వదేశంలో లాక్డౌన్ అమలవుతున్ననందున ముందు జాగ్రత్త చర్యగా విదేశాల నుంచి తిరిగి వచ్చిన వారు స్వీయ గృహనిర్బంధంలోకి వెళ్లి సోషల్ డిస్టెన్స్ను పాటించాలి అని సూచించారు. కోవిడ్ 19 వేగంగా విస్తరిస్తున్నందున తగు జాగ్రత్తలు తీసుకోవాలి అని అన్నారు.
ఇది మీకు టార్చర్గా అనిపించవచ్చు. ఇంట్లోనే గడపడం అవమానంగా అనిపించవచ్చు. కానీ మీ క్షేమం కోసమే ప్రభుత్వం ఈ చర్యలు తీసుకొన్నదనే విషయాన్ని గమనించాలి. దయచేసి ప్రభుత్వ ఆదేశాలను బ్రేక్ చేయకండి. ఇంట్లోనే ఉంటూ క్షేమంగా ఉండండి. మనమంత ఒకే మాటకు కట్టుబడి ఐక్యంగా ఉంటేనే కరోనాను తరిమి కొట్టవచ్చు అని త్రిష వీడియోలో వెల్లడించింది.
ఇటీవలే టిక్టాక్ యాప్లొకి ప్రవేశించిన త్రిషకు చేతినిండా ప్రాజెక్టులు ఉన్నాయి. శరవణన్ రూపొందించే రాంగీ, సుమంత్ రాధాకృష్ణన్ తెరకెక్కించే షుగర్, మణిరత్నం రూపొందిస్తున్న పొన్నియన్ సెల్వన్ చిత్రాల్లో నటిస్తున్నారు.