Don't Miss!
- News కేసీఆర్ కు రేవంత్ వార్నింగ్ - ఇక లెక్క పెట్టుకో..!!
- Automobiles ఈవీ ఓనర్లకు Google Maps గుడ్ న్యూస్.. ఇకపై మీకు ఈ టెన్షన్ ఉండదు.!!
- Sports సూర్య సిగ్గుపడాలి.. క్రీడాస్ఫూర్తిని మరిచి నీఛమైన పని!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
- Technology ఎయిర్ కండిషనర్ AC ను కొనుగోలు చేయాలని ప్లాన్ చేస్తున్నారా... అయితే ఇవి తెలుసుకోండి..!
- Lifestyle భార్యా భర్త గొడవపడినా..బంధం బలంగా ముందుకు కొనసాగాలంటే ఇవి పాటించాలి..
అందుకే సమంతను పక్కన పెట్టేశారా? యంగ్ హీరోయిన్ ఘాటు రియాక్షన్
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అక్కినేని సమంత గురించిన ఓ వార్తపై ఘాటుగా స్పందించింది యంగ్ హీరోయిన్ అదితీరావు హైదరీ. సమంత విషయంలో ఇలాంటి వార్తలు రాయడమేంటంటూ ట్విట్టర్ వేదికగా రియాక్ట్ అయింది ఈ ముద్దుగుమ్మ.
అజయ్ భూపతి తెరకెక్కించనున్న మహాసముద్రం సినిమాలో సమంతను హీరోయిన్ గా తీసుకున్నారని ఆ మధ్య వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. శర్వానంద్ హీరోగా ఈ సినిమా రూపొందనుంది. అయితే ఆ తర్వాత సమంతను మహాసముద్రం నుంచి తప్పించారని, ఆమె స్థానంలో అదితీరావును హీరోయిన్గా తీసుకున్నారని టాక్ బయటకొచ్చింది.
దీంతో ఇటీవల జాను ఫ్లాప్ కావడం కారణంగానే మహాసముద్రం నుంచి సమంతను తప్పించారని, ఆమె స్థానంలో అదితిని తీసుకున్నారని ఓ ఆంగ్ల వెబ్సైట్ న్యూస్ ప్రచురించింది. ఈ వార్త చూసిన అదితీరావు హైదరీ ట్విట్టర్ వేదికగా ఘాటు రియాక్షన్ ఇచ్చింది. వార్తను తన ట్విటర్ ఖాతాలో పోస్ట్ చేసిన అదితి.. సినిమా హిట్, ఫ్లాప్ అనేవి నటీనటుల సామర్థ్యాన్ని నిర్ణయించలేవని పేర్కొంది.
''నేను ఓ ముఖ్యమైన విషయం చెప్పాలనుకుంటున్నాను. దయచేసి మీ ఆలోచనా విధానాన్ని మార్చుకోండి. ఇంకో విషయం ఏమిటంటే.. ఓ సినిమా గురించి ప్రకటించే అవకాశం దర్శకులు, నిర్మాతలకే వదిలేయండి. ధన్యవాదాలు'' అని పేర్కొంది అదితీరావు హైదరీ. దీంతో ఈ ఇష్యూ టాలీవుడ్ సర్కిల్స్లో హాట్ టాపిక్ అయింది.