Don't Miss!
- Sports RR vs DC: అందుకే పృథ్వీ షాను తీసుకోలేదు: రిషభ్ పంత్
- News హీరోయిన్ నిధి అగర్వాల్ చేతుల మీదగా గ్రాండ్గా రీలాంచ్ అయిన CMR షాపింగ్ మాల్
- Technology రియల్మి కొత్త ఫోన్ టీజర్ విడుదల.. సెగ్మెంట్లోనే సన్నని డిజైన్ సహా కీలక ఫీచర్లు..!
- Automobiles 6 కోట్ల కస్టమర్లతో భారత్లో హోండా తిరుగులేని రికార్డు.. ఎక్కువగా వీటిపైనే క్రేజ్.!!
- Lifestyle First Surya Grahan: ఏప్రిల్ నెలలో మొదటి సూర్య గ్రహణం ఎప్పుడు? సూతక కాలం
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
మరో రెండు బాలీవుడ్ సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన అడివి శేష్.. మేజర్ తరువాత మరింత కొత్తగా..
దర్శకుడిగా రైటర్ గా ఒక మంచి నటుడిగా తనకంటూ ఒక ప్రత్యేకమైన క్రేజ్ అందుకున్న అడివి శేష్ ప్రస్తుతం మేజర్ సినిమాతో స్ట్రాంగ్ గా రెడీ అవుతున్నాడు. మేజర్ ఉన్ని కృష్ణన్ జీవిత ఆధారంగా తెరకెక్కబోతున్న ఆ సినిమాపై అంచనాలు అయితే గట్టిగానే ఉన్నాయి. ఇక ఇటీవల సినిమాను పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా విడుదల చేయబోతున్నట్లు క్లారిటీ కూడా ఇచ్చేశారు. తప్పకుండా సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చుతుంది అని చిత్ర యూనిట్ చాలా నమ్మకంగా ఉంది. ఈ బయోగ్రాఫికల్ డ్రామా 2022 ఫిబ్రవరి 11న తెరపైకి రావడానికి సిద్ధంగా ఉంది. ఇది హిందీ మరియు అన్ని దక్షిణ భారతీయ భాషలలో ఏకకాలంలో విడుదల అవుతుంది. ఈ చిత్రం విడుదలకు ముందే, శేష్ ఇప్పటికే రెండు హిందీ ప్రాజెక్ట్ లకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం.
ఈ టాలెంటెడ్ నటుడు ఇటీవల ఒక నేషనల్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అందుకు సంబంధించిన వివరాలను కూడా వెల్లడించాడు. నేను నా తదుపరి రెండు హిందీ చిత్రాలకు సంతకం చేశాను. నేను వాటిని మేజర్ సినిమా అనంతరం పూర్తి చేస్తానని తెలియజేశాడు. ప్రస్తుతం తన ఫోకస్ మొత్తం మేజర్ సినిమాపైనే ఉందని అంటూ.. మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితాన్ని పెద్ద ఎత్తున ప్రపంచానికి తీసుకెళ్లాలనుకుంటున్నానని శేష్ తెలిపారు. 26/11 ముంబై దాడుల్లో మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ వీర మరణం పొందాడు. గత రెండేళ్లుగా అడివి శేష్ ఈ ప్రాజెక్ట్ తో బిజీగా ఉన్నాడు.
ఇక శేష్ టాలెంట్ గురించి తెలుసుకొని టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమాను నిర్మించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. మహేష్ GMB ప్రొడక్షన్ లో మేజర్ సినిమా తెరపైకి రానుంది. ఇక శేష్ టాలెంట్ కు ముందుగానే హిందీ దర్శక నిర్మాతలు కూడా అతనితో సినిమా చేసేందుకు ఆసక్తిని చూపిస్తున్నారు. ఇక అతను చేయబోయే హిందీ చిత్రాల గురించి మరిన్ని వివరాలు తెలియాలంటే మరికొన్ని నెలలు ఆగాల్సిందే.
గూడాచారి ఫేమ్ శశి కిరణ్ టిక్కా దర్శకత్వం వహించిన మేజర్ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ సాయి మంజ్రేకర్ కీలక పాత్రసినిమాలో నటిస్తోంది. ఇక ప్రకాష్ రాజ్, రేవతి మరియు శోభితా ధూళిపాళ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. సోనీ పిక్చర్స్, GMB ఎంటర్టైన్మెంట్ మరియు A+S మూవీస్ సంయుక్తంగా ఈ ప్రాజెక్ట్ను నిర్మిస్తోంది. తెలుగులో కూడా ఈ హీరోకి ఆఫర్స్ చాలానే వస్తున్నాయి. మేజర్ అనంతరం పూర్తి చేయాల్సిన తెలుగు సినిమాలు కూడా బ్యాలెన్స్ ఉన్నాయి. మేజర్ విడుదలైన తరువాత శేష్ గూఢచారి 2ని స్టార్ట్ చేయనున్నాడు. కేవలం హీరోగానే కాకుండా అడివి శేష్ తన సినిమాకు తనే రైటింగ్ బాధ్యతలు కూడా తీసుకుంటున్నాడు. ఆ రూట్లో ఈ హీరో బాగానే క్రేజ్ అందుకుంటున్నాడు. ఇక త్వరలోనే బాలీవుడ్ లో చేయబోయే రెండు సినిమాలు అతనికి ఏ స్థాయిలో క్రేజ్ ను అందిస్తాయో చూడాలి.