Just In
- 2 hrs ago
శివరాత్రికి ‘శ్రీకారం’.. శర్వానంద్ సందడి అప్పుడే!
- 3 hrs ago
ట్రెండింగ్ : బాగానే వాడుకుంటున్నారు.. గుండెపై పచ్చబొట్టు.. రాహుల్ మీదకు ఎక్కేసిన అషూ రెడ్డి
- 4 hrs ago
HBD Namrata.. ఐదేళ్లలో 29 హెల్త్ క్యాంప్స్.. అందుకే మహేష్ బాబుకు ఇంతటి క్రేజ్!
- 4 hrs ago
‘ఖిలాడీ’ అప్డేట్.. రవితేజ మరీ ఇంత ఫాస్ట్గా ఉన్నాడేంటి!
Don't Miss!
- News
43 లక్షల మంది ఇళ్లకు బీజేపీ కార్యకర్తలు.. హస్తిన పురవీధుల్లో.. ఎందుకంటే
- Sports
గాయపడ్డా.. బౌలింగ్ చేశా! అందుకు అదోక్కటే కారణం: సైనీ
- Finance
గోఎయిర్ బంపర్ ఆఫర్... అతి తక్కువ ధరకే విమాన టికెట్... ఇవీ వివరాలు...
- Lifestyle
మీరు దీన్ని తింటే, అన్ని వ్యాధులు A to Z మాయం అవుతాయి ...
- Automobiles
నిస్సాన్ మాగ్నైట్ అప్డేట్: 35,000కి పైగా బుకింగ్స్, 2 లక్షలకు పైగా ఎంక్వైరీస్
- Technology
వన్ప్లస్ నార్డ్ స్మార్ట్ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
‘మేజర్’ అప్డేట్.. ఫస్ట్ లుక్ రాబోతోంది!
విభిన్న కథ, కథనాలు ఎంచుకుని విలక్షణ నటనతో వరుసగా విజయాలు అందుకుంటున్నాడు అడివి శేష్. హీరోగానే కాకుండా మంచి కథకుడిగానూ అడివి శేష్ తెలుగు ప్రేక్షకుల మనసును దోచేస్తున్నాడు. క్షణం, గూఢాచారి, ఎవరు వంటి వరుస బ్లాక్ బస్టర్లతో అడివి శేష్.. తనకంటూ ఓ స్పెషల్ మార్కెట్ను సృష్టించుకున్నాడు. అడివి శేష్ సినిమా వస్తోందంటే.. ఏదో ఒక కొత్త దనం, యూనిక్ పాయింట్ ఉంటుందని అందరూ ఆశిస్తున్నారు.
ఆ అంచనాలకు తగ్గట్టే అడివి శేష్ తన తదుపరి చిత్రాన్ని పట్టాలెక్కిస్తున్నాడు. ముంబై 26/11 ఉగ్రవాది దాడిలో ప్రాణాలు కోల్పోయిన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవిత చరిత్ర ఆధారంగా రాబోతోన్న మేజర్ సినిమా గురించి అడివి శేష్ స్వయంగా కొన్ని వివరాలను చెబుతూ ఆ మధ్యఓ వీడియోను రిలీజ్ చేశాడు. ఈ కథతో ఎంత ఎమోషనల్గా అటాచ్ అయ్యాడో వివరించాడు. మేజర్ సందీప్ను చూస్తే సోదరబావం కలిగిందంటూ అడివి శేష్ చెప్పిన మాటలు అందరినీ కదిలించాయి.

తాజాగా మేజర్కు సంబంధించి ఓ అప్డేట్ వచ్చింది. ఈ మూవీ నుంచి ఫస్ట్ లుక్ను డిసెంబర్ 17 ఉదయం పది గంటలకు విడుదల కాబోతోందని ప్రకటించారు. మీరంతా సిద్దంగా ఉన్నారా? అంటూ అడివి శేష్ అప్డేట్పై అందరికీ ఆసక్తిని కలిగించాడు. ఈ మూవీని మహేష్ బాబు తన జీఎంబీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్పై నిర్మిస్తున్నాడు. ఈ సినిమాలో శోభితా ధూళిపాళ్ల హీరోయిన్గా నటిస్తోంది. ఈ చిత్రాన్ని శశి కిరణ్ తెరకెక్కిస్తున్నాడు.