Don't Miss!
- Sports RR vs DC: చరిత్ర సృష్టించిన రిషభ్ పంత్.. ఒకే ఒక్కడిగా..!
- News సీఎం జగన్ కొత్త ఎన్నికల నినాదం..డబుల్ సెంచరీ ప్రభుత్వం అంటూ
- Lifestyle ఎన్నికల ముందు ప్రచారంలో గాల్లో మేడలు కడుతున్న నాయకులు..
- Technology రియల్మి కొత్త ఫోన్ టీజర్ విడుదల.. సెగ్మెంట్లోనే సన్నని డిజైన్ సహా కీలక ఫీచర్లు..!
- Automobiles 6 కోట్ల కస్టమర్లతో భారత్లో హోండా తిరుగులేని రికార్డు.. ఎక్కువగా వీటిపైనే క్రేజ్.!!
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
‘మేజర్’ నుంచి మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్: సాక్షిని పరిచయం చేయబోతున్న అడవి శేష్
కొంత కాలంగా తెలుగులో బయోపిక్ల హవా కనిపిస్తోంది. ఇప్పటికే ఎంతో మంది ప్రముఖుల జీవితాలకు సంబంధించిన చిత్రాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. ఈ క్రమంలోనే ప్రస్తుతం ముంబై నగరంలో జరిగిన ఉగ్రదాడుల్లో వీర మరణం పొందిన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవిత కథ ఆధారంగా ఓ సినిమా రూపొందుతోంది. అదే.. 'మేజర్'. అడవి శేష్ టైటిల్ రోల్ చేస్తున్న ఈ సినిమాను శశి కిరణ తిక్క తెరకెక్కిస్తున్నాడు. ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందుతోన్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతోంది. ఈ నేపథ్యంలో తాజాగా దీని నుంచి ఓ ఇంట్రెస్టింగ్ అప్డేట్ వచ్చేసింది.
అడవి శేష్ నటిస్తోన్న ద్విభాషా చిత్రం 'మేజర్' ప్రమోషన్ వినూత్నంగా సాగుతోంది. దీని నుంచి ఏ అప్డేట్ వచ్చినా జనాలు చర్చించుకునేలా కొత్త కొత్త పేర్లతో మాయ చేస్తున్నారు. తద్వారా ఆడియెన్స్ నుంచి మంచి రెస్పాన్స్ను అందుకుంటున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి లుక్ టెస్ట్, ఫస్ట్ లుక్, లెటర్ టు సందీప్ సహా ఎన్నో సర్ప్రైజింగ్ ఫొటోలు వచ్చాయి. ఈ క్రమంలోనే ఇప్పుడు 'మేజర్' నుంచి మరో కొత్త క్యారెక్టర్ను పరిచయం చేయబోతున్నట్లు హీరో అడవి శేష్ వెల్లడించాడు. ఈ మేరకు తన ట్విట్టర్ ఖాతాలో ప్రకటనతో కూడిన పోస్టర్ను కూడా వదిలాడు.
'ఆమె జీవితంలో అదో మామూలు రోజు. కానీ, అప్పుడే ఎటాక్ మొదలైంది. ఆ దుర్ఘటనకు ఆమె సాక్షి. మేజర్లోని కొత్త క్యారెక్టర్ను పరిచయం చేస్తున్నాం' అంటూ ట్వీట్ చేశాడు అడవి శేష్. ఈరోజు సాయంత్రం 4.59 గంటలకు ఈ సర్ప్రైజ్ రివీల్ కాబోతుంది. ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందుతోన్న ఈ సినిమాను సోనీ పిక్చర్స్ ఇంటర్నేషనల్ ప్రొడక్షన్స్, టాలీవుడ్ సూపర్స్టార్ మహేష్ బాబు నిర్మాణ సంస్థ జి మహేష్బాబు ఎంటర్టైన్మెంట్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. సయీ మంజ్రేకర్ హీరోయిన్గా చేస్తోంది. ఇది 2021, జూలై 2న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.