Don't Miss!
- Lifestyle పుచ్చకాయ జ్యూస్ లో ఈ ఒక్కటి కలిపి తాగితే చాలు వేసవి ఆరోగ్య సమస్యలు బలాదూర్..మీ శరీరానికి శాంతం..ఉపశమనం
- Finance Upper Circuit: లాభాల కిక్ ఇస్తున్న లిక్కర్ స్టాక్.. 8 రోజులుగా అప్పర్ సర్క్యూట్లోనే.. కొన్నారా..??
- News నామినేషన్ వేయనున్న వైఎస్ జగన్
- Sports హార్దిక్కు అంబానీ వార్నింగ్.. సంచలన నిర్ణయానికి సిద్ధం!
- Automobiles ట్రాఫిక్లో ఉన్నప్పుడు ఈ పొరపాట్లు చేశారో.. ప్రమాదాన్ని కొని తెచ్చుకున్నట్లే.!!
- Technology Nokia 225 4G 2024 మోడల్ ధర, స్పెసిఫికేషన్లు మరియు డిజైన్ లీక్! వివరాలు
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
‘మేజర్’ నుంచి మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్: సాక్షిని పరిచయం చేయబోతున్న అడవి శేష్
కొంత కాలంగా తెలుగులో బయోపిక్ల హవా కనిపిస్తోంది. ఇప్పటికే ఎంతో మంది ప్రముఖుల జీవితాలకు సంబంధించిన చిత్రాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. ఈ క్రమంలోనే ప్రస్తుతం ముంబై నగరంలో జరిగిన ఉగ్రదాడుల్లో వీర మరణం పొందిన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవిత కథ ఆధారంగా ఓ సినిమా రూపొందుతోంది. అదే.. 'మేజర్'. అడవి శేష్ టైటిల్ రోల్ చేస్తున్న ఈ సినిమాను శశి కిరణ తిక్క తెరకెక్కిస్తున్నాడు. ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందుతోన్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతోంది. ఈ నేపథ్యంలో తాజాగా దీని నుంచి ఓ ఇంట్రెస్టింగ్ అప్డేట్ వచ్చేసింది.
అడవి శేష్ నటిస్తోన్న ద్విభాషా చిత్రం 'మేజర్' ప్రమోషన్ వినూత్నంగా సాగుతోంది. దీని నుంచి ఏ అప్డేట్ వచ్చినా జనాలు చర్చించుకునేలా కొత్త కొత్త పేర్లతో మాయ చేస్తున్నారు. తద్వారా ఆడియెన్స్ నుంచి మంచి రెస్పాన్స్ను అందుకుంటున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి లుక్ టెస్ట్, ఫస్ట్ లుక్, లెటర్ టు సందీప్ సహా ఎన్నో సర్ప్రైజింగ్ ఫొటోలు వచ్చాయి. ఈ క్రమంలోనే ఇప్పుడు 'మేజర్' నుంచి మరో కొత్త క్యారెక్టర్ను పరిచయం చేయబోతున్నట్లు హీరో అడవి శేష్ వెల్లడించాడు. ఈ మేరకు తన ట్విట్టర్ ఖాతాలో ప్రకటనతో కూడిన పోస్టర్ను కూడా వదిలాడు.
'ఆమె జీవితంలో అదో మామూలు రోజు. కానీ, అప్పుడే ఎటాక్ మొదలైంది. ఆ దుర్ఘటనకు ఆమె సాక్షి. మేజర్లోని కొత్త క్యారెక్టర్ను పరిచయం చేస్తున్నాం' అంటూ ట్వీట్ చేశాడు అడవి శేష్. ఈరోజు సాయంత్రం 4.59 గంటలకు ఈ సర్ప్రైజ్ రివీల్ కాబోతుంది. ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందుతోన్న ఈ సినిమాను సోనీ పిక్చర్స్ ఇంటర్నేషనల్ ప్రొడక్షన్స్, టాలీవుడ్ సూపర్స్టార్ మహేష్ బాబు నిర్మాణ సంస్థ జి మహేష్బాబు ఎంటర్టైన్మెంట్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. సయీ మంజ్రేకర్ హీరోయిన్గా చేస్తోంది. ఇది 2021, జూలై 2న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.