Don't Miss!
- Sports DC vs RR: రిషభ్ పంత్ విధ్వంసం.. ఒకే ఓవర్లో 31 పరుగులు! వీడియో
- News కేసీఆర్ కాన్వాయ్లో ప్రమాదం: ఒకదానికొకటి 8 వాహనాలు ఢీ
- Lifestyle పెళ్లైన వ్యక్తితో డేటింగా? కాస్త ముందు..వెనకా ఆలోచించండి..లేదంటే కొంప కొల్లేరే..!
- Technology OPPO Find X7 Ultra కెమెరా రివ్యూ! అద్భుతమైన ఫీచర్లతో, బెస్ట్ కెమెరా ఫోన్!
- Automobiles 323 కి.మీ రేంజ్తో ప్రీమియం ఎలక్ట్రిక్ బైక్ విడుదల.. ధర తెలిస్తే కొనేందుకు ఆలోచిస్తారు..!!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
‘మేజర్’ నుంచి అదిరిపోయే అప్డేట్: ప్రత్యేకమైన రోజును గుర్తు చేసుకుందాం అంటూ శేష్ ట్వీట్
విభిన్నమైన చిత్రాలతో తనలోని విలక్షణ నటనను బయటపెట్టి.. వరుస విజయాలను అందుకుంటూ దూసుకుపోతున్నాడు యంగ్ టాలెంటెడ్ హీరో అడవి శేష్. కెరీర్ ఆరంభంలో కెరీర్ ఆరంభంలో పవన్ కల్యాణ్ 'పంజా', రవితేజ 'బలుపు' వంటి సినిమాల్లో విలన్గా నటించి మెప్పించి అతడు.. హీరోగా మారిన తర్వాత 'క్షణం', 'గూఢచారి', 'ఎవరు' సస్పెన్స్ థ్రిల్లర్ మూవీలతో విజయాలను అందుకున్నాడు. తద్వారా టాలీవుడ్లోనే మంచి టేస్ట్ ఉన్న హీరోగా పేరొందాడు. ఈ క్రమంలోనే అడవి శేష్ ప్రస్తుతం నటిస్తోన్న చిత్రం 'మేజర్'. ఈ మూవీ నుంచి ఓ అప్డేట్ రాబోతుంది.
ముంబైలో జరిగిన ఉగ్రదాడుల్లో వీర మరణం పొందిన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతోన్న చిత్రమే 'మేజర్'. శశికిరణ్ తిక్క తెరకెక్కిస్తోన్న ఈ సినిమాలో అడవి శేష్ టైటిల్ రోల్లో నటిస్తున్నాడు. వాస్తవిక కథతో రూపొందుతోన్న ఈ సినిమా నుంచి మార్చి 15 సాయంత్రం 4 గంటలకు ఓ అప్డేట్ రాబోతుందని తాజాగా చిత్ర యూనిట్ ప్రకటించింది. ఈ మేరకు అడవి శేష్ తన ట్విట్టర్ ఖాతాలో 'రేపు మేజర్ సందీప్ జయంతి. ఈ సందర్భంగా ఆయన త్యాగాలను గుర్తు చేసేలా ఓ అప్డేట్ ఇవ్వబోతున్నాం' అంటూ ఓ పోస్టర్ను షేర్ చేశాడు.
ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందుతోన్న 'మేజర్'ను సోనీ పిక్చర్స్ ఇంటర్నేషనల్ ప్రొడక్షన్స్, టాలీవుడ్ సూపర్స్టార్ మహేష్ బాబు నిర్మాణ సంస్థ జి మహేష్బాబు ఎంటర్టైన్మెంట్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. పాన్ ఇండియా లెవెల్లో ఈ చిత్రం రూపొందుతోంది. ఇప్పటికే విడుదలైన టీజర్, పోస్టర్లకు భారీ స్థాయిలో రెస్పాన్స్ వచ్చింది. ఇక, ఈ సినిమాలో సయీ మంజ్రేకర్ హీరోయిన్గా నటిస్తోంది. ఈ చిత్రాన్ని 2021, జూలై 2న ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నట్లు చిత్ర యూనిట్ గతంలోనే ప్రకటించిన విషయం తెలిసిందే.