Don't Miss!
- News రూ.100 తో ఊరు వదిలాడు.. రూ.200 కోట్లకు అధిపతి
- Sports RCB Playing XI: అతనికి నిరాశే.. సన్రైజర్స్ హైదరాబాద్తో తలపడే ఆర్సీబీ తుది జట్టు ఇదే!
- Lifestyle పురుషుల్లో ఈ లక్షణాలు ఉంటే.. ఖచ్చితంగా డిప్రెషన్కు గురైనట్టే..!
- Automobiles కారులో ఎక్కువ సౌండ్తో మ్యూజిక్ వింటూ వెళ్తున్నారా.. మీ కారు ప్రమాదానికి గురయ్యే అవకాశం ఎక్కువ.. ఎందుకంటే??
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
- Technology Realme నుంచి రెండు కొత్త ఫోన్లు లాంచ్ అయ్యాయి! ధర రూ.11,999 కే మొదలు
ఫస్ట్టైమ్ వికెట్ పడింది.. అందరూ ప్రొఫెషనల్ అనుకున్నారు: ఐశ్వర్య రాజేష్
క్రియేటివ్ కమర్షియల్స్ పతాకంపై భీమనేని శ్రీనివాసరావు దర్శకత్వంలో ప్రొడక్షన్ నెం.47గా క్రియేటివ్ ప్రొడ్యూసర్ కె.ఎ.వల్లభ నిర్మిస్తున్న విభిన్న కథా చిత్రం 'కౌసల్య కృష్ణమూర్తి ది క్రికెటర్'. కేఎస్ రామారావు సమర్పణలో తెరకెక్కిన చిత్రంలో ఐశ్వర్య రాజేష్ లీడ్ రోల్ పోషించగా.. రాజేంద్రప్రసాద్, వెన్నెల కిషోర్ ముఖ్యపాత్రలు పోషించారు. ఈ రోజే (ఆగస్టు 23) విడుదలైన ఈ సినిమా ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన తెచ్చుకుంటోంది.
కాగా ఈ చిత్ర ప్రమోషన్స్లో భాగంగా ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న హీరోయిన్ ఐశ్వర్య రాజేష్ సినిమా విశేషాలతో పాటు పలు ఆసక్తికర విశేషాలు చెప్పుకొచ్చింది. ఒక మంచి సినిమా కోసం చాలా రోజుల నుండి వెయిట్ చేశానని, తమిళ్లో తాను చేసిన క్యారెక్టర్స్ అన్నీ పెర్ఫార్మెన్స్ ఓరియెంటెడ్గా ఉంటాయి కాబట్టి తెలుగులోనూ మంచి సినిమాతో ఇంట్రడ్యూస్ అవ్వాలని అనుకున్నానని చెప్పిన ఆమె 'కౌసల్య కృష్ణమూర్తి ది క్రికెటర్' సినిమా ద్వారా తెలుగు తెరపై అడుగుపెట్టడం సంతోషంగా ఉందని తెలిపింది.
క్రికెట్ నేపథ్యంలో తెరకెక్కిన సినిమా కావడంతో క్రికెట్ మెళకువలు నేర్చుకునేందుకు చాలా కష్టపడ్డానని పేర్కొంది ఐశ్వర్య. సినిమా సెట్స్ పై ఫస్ట్ షాట్ చేసేటపుడు మూడు కెమెరాలు, ఒక డ్రోన్ కెమెరాతో షూట్ చేయడం జరిగిందని, అలా తాను ఫస్ట్టైమ్ బౌలింగ్ చేయగానే వికెట్ పడటంతో అంతా ఆశ్చర్యపోయారని తెలిపింది ఐశ్వర్య. ఇది చూడగానే తనను ఒక ప్రొఫెషనల్ క్రికెటర్ అనుకున్నారని చెప్పిన ఆమె.. ఈ సినిమా షూటింగ్ లో భాగంగా బౌలింగ్, బ్యాటింగ్ రెండూ ఎంజాయ్ చేశానని పేర్కొంది.