Don't Miss!
- News సుమలత దెబ్బకు మాజీ సీఎం హడల్, ఇంతవరకు ప్రచారం చెయ్యలేదు, అసలు మ్యాటర్ !
- Sports IPL 2024: చరిత్ర సృష్టించిన సన్రైజర్స్ హైదరాబాద్!
- Technology Whatsapp File Sharing Feature వాట్సాప్లో కొత్త ఫీచర్.. సులభంగా ఫైల్స్ షేర్ చేసుకోవచ్చు..!
- Lifestyle మీ భార్యతో ఇలా ఎప్పుడైనా ఉన్నారా..? ఆ విషయంలో భర్త తగ్గాల్సిందే..!
- Finance HDFC Bank: అంచనాకు అనుగుణంగానే హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఫలితాలు..!
- Automobiles త్వరలోనే ఎయిర్ ట్యాక్సీ సర్వీస్.. 7 నిమిషాల్లో 30 కి.మీ జర్నీ.. ఇండిగో గుడ్ న్యూస్
- Travel తెలంగాణ టూరిజం.. హైదరాబాద్ టు షిర్డీ ఫ్లైట్ టూర్ ప్యాకేజీ..
కొడుకుతో ‘రొమాంటిక్’ చేయబోతున్న పూరి జగన్నాథ్!
ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాధ్ తన కుమారుడు ఆకాష్ పూరిని 'మెహబూబా' సినిమా ద్వారా గతేడాది లాంచ్ చేశారు కానీ సినిమా బాక్పాఫీసు వద్ద వర్కౌట్ కాలేదు. ఎలాగైనా ఆకాష్ను ఇండస్ట్రీలో హీరోగా నిలబెట్టాలనే ప్రయత్నంలో ఉన్న పూరి... సెకండ్ మూవీ అనౌన్స్ చేశారు.
'రొమాంటిక్' అనే టైటిల్తో రూపొందుతున్న ఈచిత్రాన్ని స్వయంగా పూరి జగన్నాథ్ నిర్మించడంతో పాటు కథ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్ సమకూర్చారు. అయితే డైరెక్షన్ మాత్రం తన శిష్యుడు అనిల్ పాడూరికి అప్పగించారు. ఇంతకు ముందు తన డైరెక్షన్లో చేసిన 'మెహబూబా' ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో ఫెయిల్ అవ్వడంతో ఈ సారి పూరి ఆ బాధ్యతలకు దూరంగా ఉంటున్నారు.
#romantic @ActorAkashPuri @Charmmeofficial #AnilPaduri #shootbegins pic.twitter.com/hubvghGZc0
— PURIJAGAN (@purijagan) February 11, 2019
ఇది ప్రేమకథా చిత్రమని టైటిల్లోనే హింట్ ఇచ్చిన పూరి... గత చిత్రంలో జరిగిన పొరపాట్లు మళ్లీ జరుగకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారట. హీరోయిన్, ఇతర నటీనటులు, టెక్నీషియన్ల వివరాలు త్వరలో ప్రకటించనున్నారు.
చిత్ర నిర్మాతల్లో ఒకరైన చార్మి స్పందిస్తూ... 'ఈసారి ఒక అందమైన ప్రేమకథను అందించబోతున్నాం. మీ అంచనాలను అందుకుంటామనే నమ్మకం ఉంది' అని ట్వీట్ చేశారు. హైదరాబాద్లో రెగ్యులర్ షూటింగ్ మొదలైంది.