Don't Miss!
- Sports ముంబై ఇండియన్స్కు బిగ్ షాక్: ఆ ఇద్దరికీ కోత
- News సాగర్ టెయిల్ పాండ్ నుండి ఏపీ నీటిచౌర్యం; ఎన్నికలవేళ మళ్ళీ కృష్ణా జలవివాదం!!
- Finance Gold Price Today: బంగారం ధర పై పైకే.. ఇక కొనలేమా..!
- Lifestyle లివర్ వ్యాధి లక్షణాలు ఇవే.. వెంటనే అప్రమత్తం కావాలి..
- Automobiles హ్యుందాయ్ ఎక్స్టర్ దిమ్మ తిరిగే మైలేజ్.. ఓనర్ ఫుల్ ఖుష్.. ఫొటోలతో సహా ప్రూఫ్ ఇదిగో.!!
- Travel తెలంగాణ టూరిజం.. హైదరాబాద్ టు షిర్డీ ఫ్లైట్ టూర్ ప్యాకేజీ..
- Technology ధర రూ.10 వేల లోపే, 108MP కెమెరాతో కొత్త ఫోన్! లాంచ్, సేల్ వివరాలు
అఖిల్ - సురేందర్ రెడ్డి టైటిల్ పోస్టర్ రిలీజ్: ఊరమాస్ లుక్తో అక్కినేని హీరో.. రిలీజ్ డేట్ కూడా
హీరోగా పరిచయమై చాలా కాలమే అవుతోన్న ఒక్కటంటే ఒక్క హిట్ను కూడా దక్కించుకోలేకపోయాడు అక్కినేని వారసుడు అఖిల్. వీవీ వినాయక్ తెరకెక్కించిన 'అఖిల్'తో హీరోగా పరిచయం అయిన అతడు.. ఆ తర్వాత 'హలో', 'మిస్టర్ మజ్నూ' వంటి సినిమాలు చేశాడు. ఇవేమీ ఈ అక్కినేని హీరోకు హిట్ రుచిని చూపించలేదు. అయినప్పటికీ వరుసగా సినిమాలు చేస్తూనే ఉన్నాడీ యంగ్ హీరో. ఈ క్రమంలోనే స్టైలిష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డితో ఓ సినిమాను చేస్తున్నట్లు ఇప్పటికే ప్రకటించాడు. తాజాగా ఆ మూవీ నుంచి టైటిల్ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల అయింది.
సురేందర్ రెడ్డి దర్శకత్వంలో అఖిల్ నటిస్తోన్న సినిమాకు 'ఏజెంట్' అనే టైటిల్ను పెట్టారు. ఈరోజు ఈ అక్కినేని హీరో పుట్టినరోజును పురస్కరించుకుని ఫస్ట్ లుక్ పోస్టర్ను చిత్ర యూనిట్ కొద్ది సేపటి క్రితమే విడుదల చేసింది. ఇందులో పొడవాటి జుట్టుతో ఉన్న అఖిల్.. సిగరెట్ కాల్చుతూ ఊరమాస్ లుక్తో దర్శనమిస్తున్నాడు. దీంతో ఈ పోస్టర్కు మంచి స్పందన వస్తోంది. ఫలితంగా ఇది కొద్ది సమయంలోనే సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇక, ఇదే రోజు ఈ సినిమా నుంచి మరో పోస్టర్ కూడా విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది.
స్పై థ్రిల్లర్గా రాబోతున్న 'ఏజెంట్'లో అఖిల్ SPF ఏజెంట్గా నటిస్తున్నాడు. అలాగే, మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ స్పై ఆఫీసర్ పాత్రను పోషిస్తున్నారు. వీళ్లతో పాటు ఎంతో మంది ప్రముఖులు కీలక పాత్రలను పోషిస్తున్నారు. ఇక, ఈ సినిమాను ఏకే ఎంటర్టైన్మెంట్, సురేందర్ 2 సినిమా బ్యానర్లపై సుంకర రామబ్రహ్మం, దీపా రెడ్డి, అజయ్ సుంకర నిర్మిస్తున్నారు. చాలా కాలం తర్వాత వక్కంతం వంశీ రచయితగా మారి కథను అందిస్తున్నాడు. థమన్ సంగీతం సమకూర్చబోతున్నాడు. ఇక, ఈ సినిమా డిసెంబర్ 24న రిలీజ్ చేస్తున్నట్లు కూడా ప్రకటించారు.