Don't Miss!
- News TDP MP Candidates: టీడీపీ ఎంపీ అభ్యర్ధుల ప్రకటనకు ముహుర్తం ఖరారు..!
- Technology Samsung నుంచి గెలాక్సీ అల్ట్రా డేస్ సేల్! ఆఫర్ల వివరాలు
- Automobiles Ampere Nexus కశ్మీర్ టు కన్యాకుమారి 10,000 కి.మీ టెస్ట్ రైడ్ సక్సెస్.. ఇక ప్రత్యర్థి కంపెనీలకు వణుకే.!!
- Sports ఐపీఎల్ లైవ్ ఫ్రీ.. ఒక్క RCB ఫ్యాన్స్కు తప్ప!
- Lifestyle ఈ మూడింటిలో మీ వేలు ఆకారం ఎలా ఉందో చెప్పండి... మీరు ఎలాంటి వారో మేం చెబుతాం
- Finance Gold Rate: షాకింగ్.. షాకింగ్.. షాకింగ్.. ఏకంగా రూ.4,600 పెరిగిన గోల్డ్.. ఒక్కరోజులోనే..
- Travel హోలీ సందర్భంగా దేశంలోని ఈ ప్రదేశాలను చుట్టేయండి..!
అక్కినేని ఫ్యామిలీ నుంచి మరో మల్టీస్టారర్.. హిట్ ఇచ్చిన డైరెక్టర్కు బాధ్యతలు అప్పగించిన నాగ్
టాలీవుడ్లోని సీనియర్లలో అక్కినేని నాగార్జున పేరును కొంచెం ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు. దీనికి కారణం పేరుకు సీనియర్ హీరోనే అయినా అందంలో కుర్రాళ్లతో పోటీ పడుతుండడమే. కేవలం ఆ విషయంలోనే కాదు.. సినిమాలు చేయడంలోనూ.. వ్యాపార ప్రకటనలు.. టీవీ షోలు ఇలా అన్నింటిలోనూ ఆయన టాలీవుడ్ హీరోలు అందరికంటే ముందే ఉన్నాడు. ఒకవైపు హీరోగా నటిస్తూనే.. మరోవైపు నిర్మాతగానూ వ్యవహరిస్తున్నాడు. అలాగే, బుల్లితెరపైనా కొన్ని షోలతో మెప్పిస్తున్నాడు. ఆయన పక్కన పెట్టేసిన ఓ సినిమా గురించి ఆసక్తికరమైన న్యూస్ లీక్ అయింది.
ఆశలు అడియాశలు అయ్యాయి
రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో అక్కినేని నాగార్జున నటించిన చిత్రం ‘మన్మథుడు 2'. ఎన్నో అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ ముందు బోల్తా కొట్టింది. దీంతో నాగ్ కెరీర్లోనే ఓ డిజాస్టర్ మూవీగా నిలిచిపోయింది. ఇందులో నాగ్ సరసన రకుల్ ప్రీత్ సింగ్ నటించింది. ఈ సినిమా అక్కినేని అభిమానులను కూడా తీవ్ర నిరాశకు గురి చేసిందనే చెప్పాలి.
అందులో మాత్రం మెప్పించాడు
‘మన్మథుడు 2'తో నిరాశకు గురైన అక్కినేని అభిమానులు ఓ విషయంలో మాత్రం ఖుషీ అయిపోయారు. అదే.. నాగార్జున ‘బిగ్ బాస్' షోను హోస్ట్ చేయడం. ఇటీవల ముగిసిన మూడో సీజన్ను ముందుండి నడిపించిన నాగ్.. ఇది విజయవంతం అవడంలో కీలక పాత్ర పోషించాడు. అంతేకాదు, టీఆర్పీ రికార్డులను సైతం బద్దలు కొట్టేశాడు.
త్వరలోనే మొదలెట్టేస్తాడట
‘బిగ్ బాస్' తర్వాత నాగార్జున విశ్రాంతి తీసుకుంటున్నాడు. గతంలో ఎన్నడూ జరగని విధంగా ఆయన రెండు సినిమాలకు చాలా గ్యాప్ ఇచ్చారు. అయితే, కొద్ది రోజుల్లో ఈ అక్కినేని హీరో తన కొత్త సినిమాకు సంబంధించిన ప్రకటన చేయనున్నాడని సమాచారం. దీని ద్వారా సాల్మన్ అనే కొత్త దర్శకుడు పరిచయం అవుతున్నాడట. అతడు గతంలో ‘ఊపిరి' సినిమాకు రైటర్గా పని చేశాడు.
ప్రతిష్టాత్మక చిత్రం కూడా
అక్కినేని నాగార్జన కెరీర్లోనే అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రం ‘సోగ్గాడే చిన్ని నాయన'. కల్యాణ్ కృష్ణ తెరకెక్కించిన ఈ సినిమా ఈ సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. దీంతో దీనికి ప్రీక్వెల్ ‘బంగార్రాజు' తీయడానికి సన్నాహాలు చేశారు నాగ్, దర్శకుడు కల్యాణ్లు. అయితే, ఈ సినిమా ఇప్పటి వరకు పట్టాలెక్కలేదు. దీంతో ఎన్నో ఊహాగానాలు తెరపైకి వచ్చాయి.
నాగ చైతన్య వల్లే ఆగిపోయింది
ఈ సినిమాను వాస్తవానికి ఎప్పుడో ప్రారంభించాల్సి ఉంది. కానీ, నాగ చైతన్య వల్లే ఇది ఇంకా పట్టాలెక్కలేదట. ఈ విషయాన్ని అతడే స్వయంగా వెల్లడించాడు. ‘వెంకీ మామ' ప్రమోషన్లో భాగంగా చైతూ దీనిపై మాట్లాడుతూ.. ‘నాన్న, నేను ‘బంగార్రాజు'లో నటించాల్సి ఉంది. నా కోసం ఈ స్క్రిప్టులో మార్పులు చేస్తున్నారు' అని వెల్లడించాడు. అంటే తండ్రి కొడుకుల కాంబోలో సినిమా రాబోతుందన్న మాట.