సవ్యసాచి సెన్సార్ పూర్తి.. గ్రాండ్ రిలీజ్కు సిద్ధం!
అక్కినేని నాగచైతన్య నుంచి ఈ ఏడాది రెండవ చిత్రం విడుదల కాబోతోంది. ఇటీవలే నాగ చైతన్య శైలజారెడ్డి అల్లుడుతో ఆడియన్స్ ని పలకరించాడు. ఇదిలా ఉండగా చాలా రోజులుగా చిత్రీకరణ జరుపుకుంటోన్న సవ్యసాచి చిత్రం ఎట్టకేలకు విడుదలకు సిద్ధం అవుతోంది. నవంబర్ 2 న ప్రపంచ వ్యాప్తంగా దీపావళి కానుకగా ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు.
తాజాగా సవ్యసాచి చిత్రానికి సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. ఈ చిత్రానికి యూఏ సర్టిఫికేట్ జారీ చేశారు. ట్విన్ సిండ్రోమ్ అనే వెరైటీ కాన్సెప్ట్ తో ఈ చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో హీరో ప్రమేయం లేకుండానే అతడి ఎడమ చేయి పనిచేస్తూ ఉంటుంది. ఇంత ఛాలెంజింగ్ రోల్ లో నాగ చైతన్య ఎలా నటించాడనేది ఆసక్తిగా మారింది.

ఈ చిత్రం క్రేజీ కాంబినేషన్ లో రూపొందడం విశేషం. చైతూతో ఇదివరకే ప్రేమమ్ వంటి సూపర్ హిట్ చిత్రాన్ని తెరకెక్కించిన చందూ ముండేటి ఈ చిత్రానికి దర్శకుడు. ఇక ప్రముఖ నటుడు మాధవన్ ఈ చిత్రంలో విలన్ పాత్రలో నటిస్తున్నాడు. భూమిక కీలక పాత్రలో నటిస్తోంది. చైతు సరసన నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది.


Click it and Unblock the Notifications











