Don't Miss!
- News సీఎం జగన్ వద్దకు భూమా అఖిల ప్రియ.. తరువాత ఏం జరిగిందంటే..!
- Sports క్లాసెన్కు కావ్య మారన్ స్పెషల్ గిఫ్ట్!
- Finance Ambani-Adani: చేతులు కలిపిన అంబానీ-అదానీ.. 20 ఏళ్లకు అగ్రిమెంట్.. ఆ స్టాక్ దూకుడు..
- Automobiles హ్యుందాయ్ కస్టమర్లకు అదిరిపోయే న్యూస్.. వేసవిలో ప్రత్యేకంగా సర్వీస్ క్యాంప్.. ఎప్పటివరకు అంటే.??
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
- Lifestyle నోరూరించే పచ్చి మామిడికాయ గొజ్జు మామిడికాయ కర్రీ వేడివేడి అన్నంతో తింటుంటే ఆహా అనాల్సిందే..
- Technology ఆపిల్ వరల్డ్ వైడ్ డెవలపర్ కాన్ఫరెన్స్ 2024 తేదీ వెల్లడి.. iOS 18, GenAI పై కీలక ప్రకటనలకు అవకాశం..!
నాగార్జున నుంచి బిగ్ సర్ప్రైజ్: ‘వైల్డ్ డాగ్’ ట్రైలర్కు డేట్ ఫిక్స్ చేసిన యూనిట్
ఈ మధ్య కాలంలో సరైన హిట్ దొరకక ఇబ్బందులు పడుతున్నాడు కింగ్ అక్కినేని నాగార్జున. ఇలాంటి పరిస్థితుల్లో ఈ సారి ఎలాగైనా విజయాన్ని అందుకోవాలన్న పట్టుదలతో ఉన్నాడు. ఇందుకోసం కొత్త దర్శకుడైన సోలోమన్తో కలిసి క్రైమ్ థ్రిల్లర్ మూవీకి పచ్చజెండా ఊపేశాడు. అదే.. 'వైల్డ్ డాగ్'. దాదాపు రెండేళ్ల క్రితమే ఈ మూవీ షూటింగ్ ప్రారంభమై.. గత ఏడాదే విడుదలకు సిద్ధం అయింది. అయితే, అప్పుడు లాక్డౌన్ కారణంగా ప్రేక్షకుల ముందుకు రాలేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఈ చిత్రాన్ని త్వరలోనే విడుదల చేస్తున్నట్లు ఇటీవల ప్రకటించింది చిత్ర యూనిట్.
విడుదలకు సమయం దగ్గర పడుతుండడంతో ప్రమోషన్ కార్యక్రమాలపై దృష్టి పెట్టింది 'వైల్డ్ డాగ్' యూనిట్. ఇందులో భాగంగానే ఇటీవల ప్రెస్మీట్ పెట్టి మరీ చిత్రానికి సంబంధించిన ఎన్నో విషయాలను వెల్లడించారు. ఆ తర్వాత కొంత గ్యాప్ తీసుకున్న చిత్ర బృందం.. ఈ సినిమా ట్రైలర్ను విడుదల చేస్తున్నట్లు తాజాగా ప్రకటించింది. ఈ మేరకు సోషల్ మీడియా ద్వారా ఓ పోస్టర్ను కూడా రిలీజ్ చేశారు. అందులోనే మార్చి 12 సాయంత్రం 4.05 గంటలకు ట్రైలర్ను వదులుతున్నట్లు వెల్లడించారు. దీంతో అక్కినేని అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు.
నాగార్జున కెరీర్లోనే ఎంతో ప్రతిష్టాత్మకంగా రాబోతున్న 'వైల్డ్ డాగ్'ను మాట్నీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డి నిర్మించారు. ఈ చిత్రంలో దియా మీర్జా, సయామీ కేర్, అతుల్ కులకర్ణి, ఆలీ రెజా, బిలాల్ హుస్సేన్, ప్రకాష్ సుదర్శన్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ థమన్ సంగీతం సమకూర్చాడు. ఇందులో నాగ్ ఏఎన్ఐ ఆఫీసర్గా నటిస్తున్నాడు. హైదరాబాద్ బాంబు పేలుళ్ల నేపథ్యంతో ఈ చిత్రం తెరకెక్కింది. ఇక, దీన్ని ఏప్రిల్ 2న ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నట్లు ఇటీవలే ప్రకటించారు.
ఈ చిత్రాన్ని మాట్నీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డి నిర్మించారు. ఈ చిత్రంలో దియా మీర్జా, సయామీ కేర్, అతుల్ కులకర్ణి, ఆలీ రెజా, బిలాల్ హుస్సేన్, ప్రకాష్ సుదర్శన్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ థమన్ సంగీతం సమకూర్చాడు.