Don't Miss!
- News పిఠాపురంకు చిరంజీవి, మెగా హీరోలు - ముహూర్తం ఫిక్స్..!!
- Finance Gold Price: షాకిస్తున్న బంగారం ధర.. తగ్గినట్లే తగ్గి మళ్లీ పెరిగిన గోల్డ్ ప్రైస్..
- Automobiles వెనుక నుంచి ఢీ కొట్టిన ట్రక్.. ప్రమాదానికి గురైన Hyundai Exter - వీడియో
- Sports SRHను చూస్తే భయమేస్తోంది- పాక్ దిగ్గజం
- Technology కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్లను విడుదల చేసిన జియో సినిమా... యాడ్ ఫ్రీ, 4K కంటెంట్ సహా అనేక ప్రయోజనాలు..!
- Lifestyle బీట్రూట్ జ్యూస్ తాగితే ఇన్ని ప్రయోజనాలా..? వారంపాటు తాగితే ఎలాంటి ఫలితముంటుందంటే..?
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
బాలీవుడ్ కిలాడితో క్రిష్ మూవీ.. కంగనకు ఝలక్ ఇచ్చేందుకు ప్లాన్
మణికర్ణిక సినిమా విషయంలో నటి కంగన రనౌత్తో వివాదం నుంచి బయటపడుతున్న దర్శకుడు క్రిష్ మరో బాలీవుడ్ సినిమాకు దర్శకత్వం వహించేందుకు రెడీ అవుతున్నాడు. బాలీవుడ్ కిలాడీ అక్షయ్ కుమార్తో కలిసి ఈ చిత్రాన్ని తెరకెక్కించేందుకు ప్లాన్ చేస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి.
గతంలో తెలుగులో విజయం సాధించిన టాగూర్ చిత్రాన్ని హిందీలో గబ్బర్ పేరుతో అక్షయ్ కుమార్తో ఓ సినిమాకు క్రిష్ దర్శకత్వం వహించిన సంగతి తెలిసిందే. తాజాగా మరో సినిమా కథను అక్షయ్ కుమార్కు చెప్పారని, ఆ కథ పట్ల హీరో సంతృప్తిని కూడా వ్యక్తం చేశాడనే బాలీవుడ్ పత్రిక కథనంలో పేర్కొన్నది.
అక్షయ్ కుమార్ అధికారికంగా ఓకే చెప్పిన తర్వాత క్రిష్ అఫీషియల్గా ప్రాజెక్ట్ను ఎనౌన్స్ చేస్తారట. ప్రస్తుతం అక్షయ్ కుమార్ కాంచన రీమేక్ లక్ష్మీ బాంబ్ అనే చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి లారెన్స్ దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే.
మణికర్ణిక వివాదం కొనసాగుతున్నప్పుడే క్రిష్ రూపొందించిన ఎన్టీఆర్ బయోపిక్ సినిమా విడుదలైంది. బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టడంతో క్రిష్ కొంత నిరాశకు గురయ్యారనేది సినీ వర్గాల టాక్. ఎన్టీఆర్ బయోపిక్ ఫ్లాప్ కావడంపై క్రిష్ను ఉద్దేశించి కంగన రనౌత్ కొన్ని ఘాటైన కామెంట్లు చేయడం తెలిసిందే. ఈ క్రమంలో ఓ గట్టి హిట్టు కొట్టి కంగనకు ఝలక్ ఇచ్చేందుకు ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం.