Don't Miss!
- News అభ్యర్దుల మార్పు పై చంద్రబాబు కీలక నిర్ణయం - ఆ నేతలకు పిలుపు..!!
- Sports అందుకే ధోనీ ముందుగా బ్యాటింగ్కు రావట్లేదు- CSK కోచ్
- Finance IREDA: భారీగా లాభాలను ప్రకటించిన ఐఆర్ఈడీఏ..
- Automobiles మరింత తక్కువ ధరలో బజాజ్ చేతక్ ఇ స్కూటర్.. త్వరలో లాంచ్.!!
- Technology Dell నుంచి నాలుగు కొత్త Ai ల్యాప్టాప్లు! ధర,స్పెసిఫికేషన్లు
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
'అల వైకుంఠపురములో' ప్రీ రిలీజ్ వేదిక ఎక్కడో తెలుసా..?
అల్లు అర్జున్ హీరోగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందిన సినిమా 'అల వైకుంఠపురములో'. సంక్రాంతి కానుకగా జనవరి 12వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇటీవలే సినిమా షూటింగ్కి గుమ్మడికాయ కొట్టేసిన చిత్రయూనిట్.. ప్రీ రిలీజ్ వేడుకను ఘనంగా నిర్వహించాలని ప్లాన్ చేస్తోంది.
ఈ మేరకు జనవరి 6వ తేదీని ఫైనల్ చేసిన త్రివిక్రమ్ తాజాగా వేదిక కూడా ఖరారు చేశారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన పోస్టర్ నెట్టింట వైరల్ అవుతోంది. ఇందులో పేర్కొన్న డీటెయిల్స్ ప్రకారం జనవరి 6న సాయంత్రం 5 గంటలకు యూసుఫ్ గూడలోని పోలీస్ గ్రౌండ్స్లో 'అల.. వైకుంఠపురములో' ప్రీ రిలీజ్ జరగనుంది. వైభవంగా, వినూత్నంగా జరగనున్న ఈవెంట్కి మ్యూజికల్ కాన్సర్ట్ అని నామకరణం చేశారు. అంటే బన్నీ పాటలు, థమన్ బాణీలతో యూసుఫ్ గూడలోని పోలీస్ గ్రౌండ్స్ మారుమ్రోగనున్నాయన్నమాట.
మరోవైపు ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన ''సామజవరాగమన, రాములో రాములా'' పాటలు రికార్డుల సునామీ సృష్టిస్తూ 'అల.. వైకుంఠపురములో' స్థాయిని తెలియజేశాయి. థమన్ అందించిన బాణీలకు ఫిదా అయింది ప్రేక్షకలోకం. గీతా ఆర్ట్స్ బ్యానర్, హారిక & హాసిని క్రియేషన్స్ సంయుక్త సమర్పణలో భారీ హంగులతో రూపొందిన ఈ సినిమాపై బన్నీ అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు.
ఇక ఈ చిత్రంలో అల్లు అర్జున్ సరసన సరసన పూజా హెగ్డే హీరోయిన్గా నటించగా, సీనియర్ హీరోయిన్ టబు కీలక పాత్ర పోషించింది. అల్లు అర్జున్- టబు మధ్య వచ్చే కొన్ని సన్నివేశాలు సినిమాలో హైలైట్గా నిలుస్తాయని తెలుస్తోంది.