Don't Miss!
- News ఈ ఒక్కటి ఇంట్లో ఉంటే డబ్బు ఆటోమేటిక్ గా వస్తుంది
- Sports PBKS vs MI: అతను అసాధారణ బ్యాటింగ్తో భయపెట్టాడు: హార్దిక్ పాండ్యా
- Lifestyle గుడ్నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Technology 40 గంటలకు పైగా బ్యాటరీ బ్యాకప్, ChatGPT వాయిస్ AI సపోర్టుతో నథింగ్ ఇయర్బడ్స్ విడుదల.. సేల్ వివరాలు!
- Automobiles గొప్ప మనసు చాటుకున్న రాఘవ లారెన్స్.. దివ్యాంగులకు టీవీఎస్ స్కూటర్ల పంపిణీ
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
సౌత్ ఇండియాలోనే బిగ్గెస్ట్.. 49 మంది సింగర్లు, మ్యుజిషియన్లతో.. హైప్ పెంచేస్తోన్న ‘అల’ టీమ్
ఈ సంక్రాంతికి కోళ్ల పందెలాకంటే బాక్సాఫీస్ వద్ద సూపర్స్టార్ మహేష్ బాబు, స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ పోటీనే అందర్నీ ఆకర్షిస్తోంది. ఇన్ని రోజులుగా ఉన్న ఉత్కంఠకు తెరదించుతూ.. దిల్ రాజు నిన్నటి ప్రకటనతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. మొదటగా ఫిక్స్ అయిన తేదీలకు ఇద్దరు హీరోలు వస్తున్నట్లు స్పష్టం చేశారు. ముందుగా అనుకున్న ప్రకారమే జనవరి 11న సరిలేరు నీకెవ్వరు, జనవరి 12న అల వైకుంఠపురములో వచ్చేందుకు ఇరువురు ఒప్పుకున్నారు.
ఘనంగా సరిలేరు ఈవెంట్..
ఇక్కడి వరకు ఇదంతా బాగానే ఉంది. నేటి సాయంత్రం సరిలేరు ప్రీ రిలీజ్ ఈవెంట్ను అత్యంత భారీ ఎత్తున నిర్వహించబోతోంది మహేష్ టీమ్. మెగాస్టార్ చిరంజీవిని అతిథిగా పిలిచి.. మెగా కాంపౌండ్ను, మెగాభిమానులను ఆకర్షించింది. దీంతో అల వైకుంఠపురములో టీమ్ ఇరుకున పడింది. చిరంజీవి కంటే పెద్ద హీరోను దించడం కష్టమే అనుకున్న బన్నీ టీమ్ కొత్తగా ఈవెంట్ను నిర్వహించబోతోంది.
మ్యూజిక్ కాన్సర్ట్..
అల వైకుంఠపురములో చిత్రానికి మొదటి నుంచి ఉన్న బలం తమన్. అతగాడు అందించిన సంగీతం ఈ చిత్రానికి వెన్నుముకలా నిల్చుంది. సామజవరగమన, రాములో రాముల, ఓ మైగాడ్ డాడీ, బుట్ట బొమ్మ పాటలు ఇప్పటికే ఎన్ని సంచలనాలను నమోదు చేసిందో అందరికీ తెలిసిందే. అందుకు వీటన్నంటికి ఒకేసారి ఒకే వేదికపై లైవ్గా పాడిస్తే కొత్తగా ఉంటుందనే ప్లాన్ వేసింది అల టీమ్.
|
వినూత్నంగా ప్రమోషన్లు..
అంతా సరిలేరు ప్రీ రిలీజ్ ఈవెంట్ హంగామాలో ఉండగా.. మ్యూజిక్ కాన్సర్ట్పైకి అందర్నీ దృష్టిని మరల్చేందుకు బన్నీ టీమ్ వినూత్నంగా ప్రమోషన్లు చేపట్టింది. సునీల్, హర్ష వర్దన్లతో ఓ వీడియో చేయించి సోషల్ మీడియాలో వదిలింది. అది బాగానే వర్కౌట్ అయింది. తాజాగా మరో ప్రోమోను విడుదల చేసింది యూనిట్.
లైవ్ పర్ఫామెన్స్..
దాదాపు 49మంది సింగర్లు, మ్యుజీషియన్లతో రేపు సాయంత్రం లైవ్ మ్యూజిక్ కాన్సర్ట్ ఉండబోతోందని తెలియజేస్తూ ఓ ప్రోమోను విడుదల చేశారు. ఈ ఈవెంట్లో.. శివమణి, సిద్ శ్రీరామ్, అనురాగ్ కులకర్ణి, అర్మాన్ మాలిక్, రాహుల్ సిప్లిగంజ్, రోల్ రైడా, అల వైకుంఠపురములో టైటిల్ సాంగ్ పాడిన ప్రియా సిస్టర్స్ ఇలా అందరితో లైవ్ కాన్సర్ట్ నిర్వహించబోతోన్నట్లు ప్రకటించారు. ఇదంతా చూస్తుంటే కేవలం బన్నీ ఫ్యాన్స్కే కాదు సంగీత ప్రియులకు కూడా మంచి కిక్కిచ్చేలానే ఉంది.