Don't Miss!
- Sports చరిత్ర సృష్టించిన KL రాహుల్.. ధోనీ రికార్డు బ్రేక్
- News ఏపీలో తీవ్ర వడగాల్పులు: అప్రమత్తంగా ఉండక తప్పదు
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
అభిమానులకు రామ్చరణ్ సూచన.. 'అల.. వైకుంఠపురములో' సినిమాపై కామెంట్
మెగా పవర్స్టార్ రామ్చరణ్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటారు. ఎప్పటికప్పుడు తన సినిమా విశేషాలు తెలపడమే గాక తోటి హీరోల సినిమాలు విడుదలైనప్పుడు తన రెస్పాన్స్ చెబుతుంటారు. ఈ నేపథ్యంలో అల్లు అర్జున్ తాజా సినిమా 'అల.. వైకుంఠపురములో' విడుదల సందర్బంగా చెర్రీ సోషల్ మీడియా సందేశమిచ్చారు. వివరాల్లోకి పోతే..
భారీ అంచనాలు.. ఓ రేంజ్లో 'అల.. వైకుంఠపురములో' రిలీజ్
సంక్రాంతి కానుకగా ఈ రోజు (జనవరి 12) భారీ అంచనాల నడుమ విడుదలైంది 'అల.. వైకుంఠపురములో' మూవీ. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా కోసం బన్నీ ఫ్యాన్స్ ఎప్పటినుంచో ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. అన్ని ఏరియాల్లో 'అల.. వైకుంఠపురములో' డిమాండ్ కనిపిస్తోంది.
రామ్ చరణ్ కామెంట్.. అల్లు అర్జున్, త్రివిక్రమ్
ఈ నేపథ్యంలో 'అల.. వైకుంఠపురములో' సినిమాకు ఆల్ ది బెస్ట్ చెబుతూ సోషల్ మీడియాలో తన కామెంట్ పోస్ట్ చేశారు రామ్ చరణ్. సినిమా సక్సెస్ కావాలని కోరుకుంటూ 'అల.. వైకుంఠపురములో' థియేట్రికల్ ట్రైలర్ షేర్ చేశారు. ఈ మేరకు అభిమానులకు ఓ రిక్వెస్ట్ కూడా చేశారు చెర్రీ.
రామ్ చరణ్ రిక్వెస్ట్.. పోస్ట్ వైరల్
ఆల్ ది బెస్ట్ తో మై బ్రదర్ అల్లు అర్జున్, త్రివిక్రమ్ గారు, వినోద్ గారు అని చెప్పిన రామ్ చరణ్.. సినిమాను థియేటర్స్లో మాత్రమే చూడండని రిక్వెస్ట్ చేశారు. పైరసీని ఎంకరేజ్ చేయొద్దని తెలిపారు. ఆయన పెట్టిన ఈ పోస్ట్ మెగా అభిమానులను ఖుషీ చేస్తూ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఫస్ట్ డే.. అభిమానుల కోలాహలం
మరోవైపు 'అల.. వైకుంఠపురములో' సినిమా చూసేందుకు పెద్దఎత్తున జనం థియేటర్స్కి విచ్చేస్తున్నారు. ప్రీమియర్స్ ద్వారా సక్సెస్ టాక్ రావడంతో సినిమా చూసేందుకు ఆసక్తి చూపుతున్నారు. దీంతో అన్ని సెంటర్లలో అభిమానుల కోలాహలం కనిపిస్తోంది.
'అల.. వైకుంఠపురములో' నటీనటులు
త్రివిక్రమ్ దర్శకత్వంలో గీత ఆర్ట్స్, హారిక అండ్ హాసిని క్రియేషన్స్ సంయుక్త సమర్పణలో తెరకెక్కిన 'అల.. వైకుంఠపురములో' సినిమాలో అల్లు అర్జున్ సరసన పూజా హెగ్డే హీరోయిన్గా నటించింది. టబు, రాజేంద్రప్రసాద్, తనికెళ్ల భరణి సుశాంత్, నివేతా పేతురాజ్, సునీల్, బ్రహ్మాజీ, నవదీప్, సముద్రఖని ముఖ్యపాత్రలు పోషించారు.