Don't Miss!
- Lifestyle చాణక్య నీతి ప్రకారం, ఈ అలవాట్లు మీకు తెలియకుండానే మీ సంపదను పూర్తిగా నాశనం చేస్తాయి...!
- News రిజర్వేషన్లు రద్దు చేస్తారు: మోడీ, కేసీఆర్పై రేవంత్ సంచలన ఆరోపణలు
- Sports SRH vs RCB: కొంపముంచిన విరాట్ కోహ్లీ జిడ్డు బ్యాటింగ్!
- Technology OnePlus Watch 2 వన్ప్లస్ వాచ్ 2 కొత్త వేరియంట్ విడుదల.. ధర, సేల్ పూర్తి వివరాలు..!
- Finance Jio Cinema Premium: నెలకు 29లతో జియో ప్రీమియం..
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
సెన్సేషన్ క్రియేట్ చేస్తున్న 'అల.. వైకుంఠపురములో'.. విడుదలైన కాసేపట్లోనే
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ క్రేజీ కాంబినేషన్ లో రాబోతున్న కొత్త సినిమా 'అల.. వైకుంఠపురములో'. కెరీర్ పరంగా అల్లు అర్జున్ కెరీర్ కి ఎంతో ముఖ్యమైన సినిమా కావడంతో ఈ సినిమాపై ప్రత్యేక శ్రద్ద తీసుకుంటున్నారు త్రివిక్రమ్. స్వాతంత్ర్య దినోత్సవ కానుకగా తాజాగా ఈ సినిమా టైటిల్ రివీల్ చేస్తూ స్మాల్ వీడియోతో స్పెషల్ ట్రీట్ ఇచ్చింది చిత్రయూనిట్. విడుదలైన కాసేపట్లోనే ఈ వీడియో నెట్టింట సెన్సేషన్ గా మారింది.
సోషల్ మీడియాలో అత్యంత వేగంగా వ్యూస్ రాబడుతూ కేవలం 30 నిమిషాల్లోనే 1 మిలియన్ వ్యూస్ క్రాస్ చేసేసింది. ఈ మేరకు స్పెషల్ పోస్టర్ ద్వారా తమ ఆనందాన్ని పంచుకుంది చిత్రయూనిట్. ఈ వీడియోలో ''అంత గ్యాప్ ఇచ్చావేంట్రా'' అని మురళీ శర్మ అడిగితే.. ఇవ్వలేదు.. వచ్చింది అని అల్లు అర్జున్ అనటం బన్నీ అభిమానులకు ఆసక్తి కలిగిస్తోంది.
గత సినిమా నా పేరు సూర్య తర్వాత దాదాపు ఏడాదిన్నర పాటు గ్యాప్ తీసుకున్న అల్లు అర్జున్ 'అల వైకుంఠపురములో' సినిమా ద్వారా ఎలాగైనా హిట్ కొట్టేయాలని కసిగా ఉన్నాడు. అల్లు అర్జున్ కెరీర్ లో 19 వ సినిమాగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమాలో ఆయన సరసన పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తుండగా.. సీనియర్ నటి టబు ముఖ్యపాత్ర పోషిస్తోంది. అలాగే సుశాంత్, నివేదా పేతురాజ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. వచ్చే ఏడాది జనవరిలో ఈ సినిమా విడుదల కానుంది.