Don't Miss!
- News దేశంలో ఫస్ట్ టైమ్, పోలీసులకు ఏసీ హెల్మెట్లు, ప్రభుత్వం అంటే ఇలా ఉండాలి, పండగే పండగ !
- Sports LSG vs CSK: రూ. కోట్లు పలికిన ఆ ఇద్దరిని తప్పించాం- రుతురాజ్
- Lifestyle ఇవి తింటే మీ జుట్టు చాలా బలంగా మారుతుంది.. బట్టతల కూడా రాదు..
- Technology రియల్మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Automobiles ఈవీ ఓనర్లకు Google Maps గుడ్ న్యూస్.. ఇకపై మీకు ఈ టెన్షన్ ఉండదు.!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
సెన్సేషన్ క్రియేట్ చేస్తున్న 'అల.. వైకుంఠపురములో'.. విడుదలైన కాసేపట్లోనే
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ క్రేజీ కాంబినేషన్ లో రాబోతున్న కొత్త సినిమా 'అల.. వైకుంఠపురములో'. కెరీర్ పరంగా అల్లు అర్జున్ కెరీర్ కి ఎంతో ముఖ్యమైన సినిమా కావడంతో ఈ సినిమాపై ప్రత్యేక శ్రద్ద తీసుకుంటున్నారు త్రివిక్రమ్. స్వాతంత్ర్య దినోత్సవ కానుకగా తాజాగా ఈ సినిమా టైటిల్ రివీల్ చేస్తూ స్మాల్ వీడియోతో స్పెషల్ ట్రీట్ ఇచ్చింది చిత్రయూనిట్. విడుదలైన కాసేపట్లోనే ఈ వీడియో నెట్టింట సెన్సేషన్ గా మారింది.
సోషల్ మీడియాలో అత్యంత వేగంగా వ్యూస్ రాబడుతూ కేవలం 30 నిమిషాల్లోనే 1 మిలియన్ వ్యూస్ క్రాస్ చేసేసింది. ఈ మేరకు స్పెషల్ పోస్టర్ ద్వారా తమ ఆనందాన్ని పంచుకుంది చిత్రయూనిట్. ఈ వీడియోలో ''అంత గ్యాప్ ఇచ్చావేంట్రా'' అని మురళీ శర్మ అడిగితే.. ఇవ్వలేదు.. వచ్చింది అని అల్లు అర్జున్ అనటం బన్నీ అభిమానులకు ఆసక్తి కలిగిస్తోంది.
గత సినిమా నా పేరు సూర్య తర్వాత దాదాపు ఏడాదిన్నర పాటు గ్యాప్ తీసుకున్న అల్లు అర్జున్ 'అల వైకుంఠపురములో' సినిమా ద్వారా ఎలాగైనా హిట్ కొట్టేయాలని కసిగా ఉన్నాడు. అల్లు అర్జున్ కెరీర్ లో 19 వ సినిమాగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమాలో ఆయన సరసన పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తుండగా.. సీనియర్ నటి టబు ముఖ్యపాత్ర పోషిస్తోంది. అలాగే సుశాంత్, నివేదా పేతురాజ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. వచ్చే ఏడాది జనవరిలో ఈ సినిమా విడుదల కానుంది.