Don't Miss!
- Lifestyle చింత చిగురు పప్పు: నోట్లో నీళ్ళు ఊరాల్సిందే.. వాసనకు కడుపు నిండాల్సిందే..
- Automobiles 2024 Jeep Wrangler Facelift Review జీప్ రాంగ్లర్ ఫేస్లిఫ్ట్ ఆఫ్రోడర్ పర్ఫామెన్స్ ఫుల్ రివ్యూ
- News జగన్ కు వైఎస్ వివేకా భార్య లేఖ-అవినాష్, వైసీపీ అటాక్ పై-న్యాయంవైపు నిలబడాలని విన్నపం..!
- Sports టీ20 వరల్డ్ కప్లో ధోనీ రీఎంట్రీ: బీసీసీఐ మాస్టర్ ప్లాన్!
- Finance Kotak Mahindra Bank: కొంపముంచి కోటక్ మహీంద్రా బ్యాంక్.. భారీగా పడిపోయిన స్టాక్..!
- Technology ఆపిల్ తరహా డిజైన్తో నాయిస్ స్మార్ట్వాచ్.. 1.85 అంగుళాల డిస్ప్లే, 7 రోజుల బ్యాటరీ లైఫ్తో విడుదల
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
అప్పుడే స్టార్ట్ చేసేశారుగా.. అల్లు అర్జున్ సర్ప్రైజింగ్ అప్డేట్
మాటల మాంత్రికుడు త్రివిక్రమ్, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఇద్దరూ స్పీడ్ పెంచేశారు. తమ తమ అభిమానులకు సర్ప్రైజ్ చేస్తూ ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇచ్చేశారు. ఈ ఇద్దరి కాంబోలో రాబోతున్న కొత్త సినిమా 'అల.. వైకుంఠపురములో'. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. అయితే ఓ వైపు షూటింగ్ చేస్తూనే మరోవైపు ప్రమోషన్ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు త్రివిక్రమ్.
ఈ మేరకు ఇప్పటికే చిత్ర ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేసి ఆసక్తి రేకెత్తించిన మాటల మాంత్రికుడు.. చిత్రంలోని మొదటి పాట 'సామజవరగమన' సాంగ్ విడుదలకు ముహూర్తం ఫిక్స్ చేశాడు. ఈ మేరకు సెప్టెంబర్ 28వ తేదీ ఉదయం 10 గంటలకు ఈ పాటను విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. కాగా ఈ మెలోడీ సాంగ్కి సంబంధించి 20 సెకనుల వీడియోను ఒక రోజు ముందే విడుదల చేసి ఆ తరువాత ఫుల్ సాంగ్ విడుదల చేసేలా స్కెచ్ వేశారు త్రివిక్రమ్.
సీతారామ శాస్త్రి అందించిన లిరిక్స్పై సిద్ శ్రీరామ్ 'సామజవరగమన' పాటను ఆలపించగా తమన్ సంగీతం అందించారు. ఎంతో వినసొంపుగా ఉండి ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న ఈ పాట ప్రస్తుతం యూట్యూబ్లో ట్రెండ్ అవుతోంది. దీంతో ఈ సాంగ్ పై ప్రేక్షకుల్లో క్యూరియాసిటీ పెరిగింది.
Get ur Ear phones ready Guys ♥️🎧 #AVPLFirstSingle 🎹#avplunplugged 🎵#Samajavaragamana
— thaman S (@MusicThaman) September 27, 2019
Song from 10 AM
Tom
Sung by @sidsriram
Lyrics by #padmashriseetharamasastry gaaru
My love to my team my director #Trivikram gaaru 🙌🏿@alluarjun ♥️@GeethaArts @haarikahassine pic.twitter.com/wan9zJ5tTp
వైవిధ్యభరితమైన కథాంశంతో తెరకెక్కుతున్న అల.. వైకుంఠపురములో చిత్రంలో అల్లు అర్జున్ సరసన పూజాహెగ్డే హీరోయిన్గా నటిస్తోంది. సుశాంత్, నివేదా పేతురాజ్, టబు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాపై ఇటు త్రివిక్రమ్ అభిమానులు, అటు అల్లు అర్జున్ ఫ్యాన్స్ భారీ అంచనాలు పెట్టుకున్నారు. అల్లు అర్జున్ కెరీర్లో 19వ సినిమాగా రాబోతున్న ఈ సినిమా వచ్చే ఏడాది జనవరి నెలలో విడుదల కానుంది.