Don't Miss!
- News ఏపీ ఇంటెలిజెన్స్ డీజీగా కుమార్ విశ్వజిత్, విజయవాడ సీపీగా రామకృష్ణ
- Sports DC vs GT: ఆ తప్పిదంతోనే ఓడిపోయాం: శుభ్మన్ గిల్
- Lifestyle పెళ్లైన వ్యక్తితో డేటింగా? కాస్త ముందు..వెనకా ఆలోచించండి..లేదంటే కొంప కొల్లేరే..!
- Technology OPPO Find X7 Ultra కెమెరా రివ్యూ! అద్భుతమైన ఫీచర్లతో, బెస్ట్ కెమెరా ఫోన్!
- Automobiles 323 కి.మీ రేంజ్తో ప్రీమియం ఎలక్ట్రిక్ బైక్ విడుదల.. ధర తెలిస్తే కొనేందుకు ఆలోచిస్తారు..!!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
Most Desirable Man In India: రెండోస్థానంతో బాలీవుడ్ హీరోలకు విజయ్ దేవరకొండ షాక్.. తొలిస్థానం ఎవరిందంటే!
దేశవ్యాప్తంగా 50 మంది మోస్ట్ డిజైరబుల్ మెన్ 2020 జాబితాలో టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండకు అరుదైన గౌరవం దక్కింది. ఈ జాబితాలో ఆయన రెండోస్థానంలో నిలిచారు. బాలీవుడ్లో టాప్ హీరోలందరి వెనుకకు నెట్టి ఈ ఘనతను విజయ్ దేవరకొండ సొంతం చేసుకొన్నారు. ఈ జాబితాలో బాలీవుడ్ నటుడు, దివంగత సుశాంత్ సింగ్ రాజ్పుత్ మొదటిస్థానంలో నిలిచారు. ఈ జాబితాలో ఇంకా ఎవరు ఉన్నారంటే..
ఇప్పటికే హైదరాబాద్ టైమ్స్ నిర్వహించిన సర్వేలో మోస్ట్ డిజైరబుల్ మెన్గా విజయ్ దేవరకొండ నిలిచారు. రెండేళ్లుగా వరుసగా ఈ టైటిల్ను విజయ్ దేవరకొండ నిలబెట్టుకొన్నారు. ఇక దేశవ్యాప్తంగా నిర్వహించిన పోల్లో విజయ్ దేవరకొండకు రెండోస్థానం దక్కడం విశేషంగా మారింది.
2019లో
విజయ్
దేవరకొండ
మూడోస్థానంలో
ఉండగా..
2020లో
రెండోస్థానాన్ని
ఆక్రమించారు.
ఇక
మూడో
స్థానంలో
ఆదిత్య
రాయ్
కపూర్,
నాలుగో
స్థానంలో
వికీ
కౌశల్,
5వ
స్థానంలో
దుల్కర్
సల్మాన్,
6వ
స్థానంలో
విరాట్
కోహ్లీ,
7
స్థానంలో
టైగర్
ష్రాఫ్,
8
స్థానంలో
రణ్వీర్
సింగ్,
9
స్థానంలో
గుర్ఫతే
సింగ్
ఫిర్జాదా,
10
స్థానంలో
సిద్దార్థ్
మల్హోత్రా
నిలిచారు.
ఇక 11వ స్థానంలో టీవీ స్ఠార్, బిగ్బాస్ ఫేమ్ సిద్దార్థ్ శుక్తా, 12వ స్థానంలో కార్తీక్ ఆర్యన్, 13వ స్థానంలో కార్తీక్ ఆర్యన్, 14వ స్థానంలో దిల్జిత్ దోసంజ్, 15వ స్థానంలో సిద్దాంత్ చతుర్వేది, 16వ స్థానంలో వరుణ్ ధావన్, 17వ స్థానంలో రణ్బీర్ కపూర్, 18వ స్థానంలో ఇశ్వాంక్ సింగ్, 28వ స్థానంలో రానా దగ్గుబాటి తదితరులు నించారు.
ఇక విజయ్ దేవరకొండ కెరీర్ విషయానికి వస్తే.. అర్జున్ రెడ్డితో స్టార్ హోదాను దక్కించుకొన్న ఆయన ప్రస్తుతం లైగర్ చిత్రంతో ప్యాన్ ఇండియా హీరోగా మారారు. పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రానికి కరణ్ జోహర్ సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.