Don't Miss!
- Sports RR vs DC: కన్నీటి పర్యంతమైన రియాన్ పరాగ్!
- News గ్యాంగ్స్టర్, రాజకీయ నేత ముఖ్తార్ అన్సారీ గుండెపోటుతో మృతి
- Lifestyle Love Horoscope For April 2024:ఈ రాశులకి ఏప్రిల్ లో LOVE సక్సెస్ అవుతుంది..మరికొందరికి అడ్డంకులు తప్పవు
- Technology రియల్మి కొత్త ఫోన్ టీజర్ విడుదల.. సెగ్మెంట్లోనే సన్నని డిజైన్ సహా కీలక ఫీచర్లు..!
- Automobiles 6 కోట్ల కస్టమర్లతో భారత్లో హోండా తిరుగులేని రికార్డు.. ఎక్కువగా వీటిపైనే క్రేజ్.!!
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
శ్రీవారి సన్నిధిలో అల్లు అర్జున్ ఫ్యామిలీ.. వేదపండితుల అశీర్వచనం
Recommended Video
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం 'అల.. వైకుంఠపురములో' సక్సెస్ ఎంజాయ్ చేస్తున్నారు. ఈ మేరకు 'అల.. వైకుంఠపురములో' టీమ్ తో కలిసి ఫ్యామిలీతో సహా తిరుమల టూర్ వేశారు బన్నీ. ఆ తిరుమలేశుని సన్నిధిలో ఆశీర్వాదం పొందారు అల్లు అర్జున్- స్నేహా రెడ్డి దంపతులు. ఆ విశేషాలు చూద్దామా..
సతీసమేతంగా అల్లు అర్జున్.. శ్రీవారి దర్శనం
అల్లు అర్జున్ దంపతులు ఈ రోజు (శుక్రవారం) ఉదయం తిరుమల వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. వేకువజామున నిర్వహించే అభిషేక సేవలో భాగమయ్యారు సతీసమేతంగా పాల్గొన్నారు అల్లు అర్జున్. దర్శనం అనంతరం ఆలయంలోని రంగనాయకుల మండపంలో వేదపండితులు అశీర్వచనం తీసుకున్నారు.
బన్నీ వెంటే 'అల.. వైకుంఠపురములో' టీమ్
అల్లు అర్జున్ తిరుమల ప్రయాణంలో ఆయనతో పాటు అల వైకుంఠపురములో చిత్ర దర్శకుడు త్రివిక్రమ్, నిర్మాత రాధాకృష్ణ, బన్నీవాసు వెళ్లారు. అంతా కలిసి శ్రీవారి ఆశీర్వాదం పొంది తీర్ధ ప్రసాదాలు పుచ్చుకున్నారు. టీటీడీ అధికారులు వీళ్లకు స్వాగతం పలికారు.
అల.. వైకుంఠపురములో గ్రాండ్ సక్సెస్.. అందుకే
అల.. వైకుంఠపురములో సినిమా గ్రాండ్ సక్సెస్ సాధించడంతో టీం అంతా తిరుమలకి చేరుకొని మొక్కుని చెల్లించుకున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం అల్లు అర్జున్ శ్రీవారి దర్శనం తాలూకు పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ పిక్స్ చూసి మురిసిపోతున్నారు బన్నీ అభిమానులు.
300 కోట్ల దిశగా.. ఆ ఇద్దరికీ మాంచి బూస్టింగ్
మరోవైపు 'అల.. వైకుంఠపురములో' మూవీ దేశవిదేశాల్లో నేటికీ సత్తా చాటుతోంది. సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ సినిమా కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. ఇప్పటికే ఈ మూవీ 250 కోట్ల గ్రాస్ దాటేసి 300 కోట్ల దిశగా పరుగులు పెడుతోంది. ఇటు అల్లు అర్జున్కి, అటు త్రివిక్రమ్ శ్రీనివాస్కి ఈ విజయం మాంచి బూస్టింగ్ ఇచ్చింది.
సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్..
ఇకపోతే అల్లు అర్జున్ తన తాజా ప్రాజెక్టును సుకుమార్ దర్శకత్వంలో చేస్తున్నారు. ప్రస్తుతం సెట్స్పై ఉన్న ఈ సినిమాలో ఆయన సరసన రష్మిక మందన్న హీరోయిన్గా నటిస్తోంది. విలక్షణ కథాంశంతో ఈ సినిమా రూపొందుతుండటం ఆసక్తికర అంశం.