Don't Miss!
- Automobiles ట్రాఫిక్లో ఉన్నప్పుడు ఈ పొరపాట్లు చేశారో.. ప్రమాదాన్ని కొని తెచ్చుకున్నట్లే.!!
- News ఎన్నికల ఏజెంట్లుగా వాలంటీర్లు - సీన్ రివర్స్...!!
- Sports రుతురాజ్ చెత్త రికార్డు.. చరిత్రలో ఒకే ఒక్కడు!
- Technology Nokia 225 4G 2024 మోడల్ ధర, స్పెసిఫికేషన్లు మరియు డిజైన్ లీక్! వివరాలు
- Finance IT News: టీసీఎస్ టెక్కీలకు కళ్లు బైర్లుకమ్మే షాక్.. వారికి NO వేరియబుల్ పే.. కొత్త రూల్స్..!!
- Lifestyle ఈ 4 రాశుల వారు ఉత్తమ సెక్స్ భాగస్వాములు అవుతారు... వీరిని లైఫ్ పార్ట్నర్ గా పొందడం అదృష్టం!
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
మంచు విష్ణు బిగ్ బడ్జెట్ హాలీవుడ్ సినిమా.. రంగంలోకి అల్లు అర్జున్
టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో మంచు మోహన్ బాబు వారసుడిగా ఎంట్రీ ఇచ్చిన వారి పెద్ద కుమారుడు మంచు విష్ణు నెక్స్ట్ నెవర్ బిఫోర్ అనే తరహాలో రెడీ అవుతున్నాడు. రెగ్యులర్ కమర్షియల్ సినిమాలను పూర్తిగా పక్కన పెట్టి ఒక్కసారిగా హాలీవుడ్ టెక్నీషియన్స్ తో ఎవరు ఊహించని సినిమాతో రెడీ అవుతున్నాడు. ఆ సినిమా ఎలా ఉంటుందో గాని మంచు విష్ణు మాత్రం ఎలాగైనా సినిమాతో సక్సెస్ అందుకోవాలని అద్భుతమైన ప్లాన్స్ వేసుకుంటున్నాడు.
కరోనా దెబ్బ కొట్టినా కూడా
ఇంగ్లీష్ తెలుగు భాషల్లో ఒకేసారి రూపొందిస్తున్న సినిమా మోసగాళ్ళు. ఈ సినిమా కోసం విష్ణు గత మూడేళ్ళుగా చాలానే కష్టపడుతున్నాడు. పూర్తిగా స్క్రిప్ట్ తో పర్ఫెప్ట్ బడ్జెట్ సెట్టయ్యాకే పనులను మొదలు పెట్టాడు. మధ్యలో కరోనా వైరస్ కాస్త దెబ్బ కొట్టినా కూడా దృష్టి మరల్చకుండా ఆ సినిమాపైనే మరింత ఫోకస్ పెట్టాడు. ఇక ఈ సినిమా కోసం అల్లు అర్జున్ రంగంలోకి దిగుతున్నట్లు తెలుస్తోంది.
50కోట్ల నుంచి 80కోట్ల వరకు
మోసగాళ్ళు కాన్సెప్ట్ మీద నమ్మకంతో విష్ణు బడ్జెట్ విషయంలో ఏ మాత్రం వెనక్కి తగ్గలేదట. ఒక విధంగా రిస్క్ చేస్తున్నట్లు టాక్ కూడా వచ్చింది. ఈ ప్రాజెక్ట్ కోసం మొదట 50కోట్లు అనుకోగా ఇప్పుడు రూ.80కోట్ల రూపాయలను ఖర్చు చేస్తున్నట్లు రూమర్స్ వస్తున్నాయు. ఇంతవరకు 25కోట్ల కంటే ఎక్కువగా ముందుకు వెళ్ళని మంచు విష్ణు ఒకేసారి ఆ స్థాయిలో ఖర్చు చేస్తుండడంతో ఈ న్యూస్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది.
రంగంలోకి అల్లు అర్జున్
ఇలాంటి సినిమాకు ప్రమోషన్స్ కూడా హై రేంజ్ లో ఉంటేనే అభిమానులకు మరింత దగ్గరవుతుంది. అందుకే విష్ణు ప్రమోషన్స్ కోసం అల్లు అర్జున్ సహాయాన్ని కోరాడు. ఇక సినిమాకు సంబంధించిన ఒక స్పెషల్ టీజర్ ని బన్నీ చేతుల మీదుగా అక్టోబర్ 3న రిలీజ్ చేయనున్నారు. రెగ్యులర్ గా కాకుండా ఈ సినిమాకు సంబంధించిన మెయిన్ పాయింట్ ని హైలెట్ చేస్తారట. వరల్డ్ బిగ్గెస్ట్ స్కామ్ కి సంబంధించిన దోపిడీ గురించి అల్లు అర్జున్ బయటపెట్టబోతున్నట్లు ఒక పోస్టర్ ని వదిలారు.
Recommended Video
ప్లాన్ ప్రకారం బిజినెస్ పై స్పెషల్ ఫోకస్
జెఫ్రీ చిన్ అనే హాలీవుడ్ డైరెక్టర్ తో చేస్తున్న మోసగాళ్ళు సినిమాను విష్ణు సొంత ప్రొడక్షన్ లో నిర్మిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే చాలా సినిమాలతో మంచు విష్ణు ఆర్థికంగా దెబ్బ తిన్నాడు. ఇక ఈ సారి అలా కాకుండా ప్లాన్ ప్రకారం సినిమా బిజినెస్ పై స్పెషల్ ఫోకస్ పెట్టినట్లు సమాచారం. ముఖ్యంగా ప్రమోషన్స్ తోనే సినిమాకు మంచి హైప్ క్రియేట్ చేయాలని అనుకుంటున్నారు. కాజల్ అగర్వాల్ కూడా ఈ సినిమాలో ఒక ముఖ్య పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే.