Don't Miss!
- Finance Ola Cabs IPO: త్వరలో ఓలా క్యాబ్స్ ఐపీఓ..
- Technology ధర రూ.14999 కే 6000mAh బ్యాటరీ, 50MP కెమెరా శాంసంగ్ స్మార్ట్ఫోన్ కొత్త వేరియంట్ విడుదల..!!
- News టీడీపీ ప్లాన్ బీ- వంగవీటి రాధాకు టికెట్?
- Sports అందుకే ధోనీ ముందుగా బ్యాటింగ్కు రావట్లేదు- CSK కోచ్
- Automobiles మరింత తక్కువ ధరలో బజాజ్ చేతక్ ఇ స్కూటర్.. త్వరలో లాంచ్.!!
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
'అల.. వైకుంఠపురములో' ఫినిష్.. అఫీషియల్ స్టేట్మెంట్
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్- మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ క్రేజీ కాంబోలో రాబోతున్న 'అల.. వైకుంఠపురములో' షూటింగ్ అయింది. గత కొన్ని నెలలుగా రేయింబవళ్లు షూటింగ్ షూటింగ్ జరుపుతూ బిజీగా బిజీగా గడిపిన చిత్రయూనిట్ కాస్త రిలాక్స్ కాబోతోంది. చివరి షెడ్యూల్ షూటింగ్లో బన్నీ, పూజా హెగ్డేతో పాటు మరికొందరు కీలక నటులు పాల్గొన్నారు. అయితే 'అల.. వైకుంఠపురములో' షూటింగ్ ఫినిష్ చేసి గుమ్మడికాయ కొట్టేసినట్లుగా అఫీషియల్ స్టేట్మెంట్ ఇచ్చింది చిత్రయూనిట్.
సంక్రాంతి కానుకగా జనవరి 12న 'అల.. వైకుంఠపురములో' సినిమా విడుదల కానుంది. తాజాగా షూటింగ్ కంప్లీట్ చేసుకున్న చిత్రయూనిట్ ఇక పోస్ట్ ప్రొడక్షన్ పనులను వేగవంతం చేయనుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్, పాటలకు భారీ రెస్పాన్స్ రావడంతో సినిమాపై ఓ రేంజ్ హైప్ క్రియేట్ అయింది. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఫైనల్ అవుట్ఫుట్ కోసం ప్రత్యేక శ్రద్ద పెట్టనున్నారు త్రివిక్రమ్, అల్లు అర్జున్.
It's a WRAP!! We are glad to announce that #AlaVaikuntapurramuloo shoot is complete & we will bring you all the exciting updates till the release date. Be Ready for the Biggest Sankranthi Celebration in Theatres, Only!! #AVPLFromJan12th @alluarjun #Trivikram @hegdepooja pic.twitter.com/ogqRJ3cXKY
— Haarika & Hassine Creations (@haarikahassine) December 28, 2019
'అల.. వైకుంఠపురములో' చిత్రంలో అల్లు అర్జున్ సరసన సరసన పూజా హెగ్డే హీరోయిన్గా నటించగా.. సీనియర్ హీరోయిన్ టబు కీలక పాత్ర పోషించింది. గీతా ఆర్ట్స్ బ్యానర్, హారిక & హాసిని క్రియేషన్స్ సంయుక్త సమర్పణలో భారీ హంగులతో ఈ సినిమా రూపొందింది. చిత్రానికి సంబందించిన ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా భారీగా జరిగినట్లు తెలిసింది. థమన్ అందించిన బాణీలకు ఫిదా అయిపోయింది ప్రేక్షకలోకం.