Don't Miss!
- News బీఆర్ఎస్కు భారీ షాక్: ఎంపీ కే కేశవరావు, మేయర్ విజయలక్ష్మి కాంగ్రెస్లోకి
- Sports RR vs DC: రియాన్ పరాగ్ విధ్వంసం.. 6 బంతుల్లో 5 బౌండరీలు!
- Lifestyle ఎన్నికల ముందు ప్రచారంలో గాల్లో మేడలు కడుతున్న నాయకులు..
- Technology రియల్మి కొత్త ఫోన్ టీజర్ విడుదల.. సెగ్మెంట్లోనే సన్నని డిజైన్ సహా కీలక ఫీచర్లు..!
- Automobiles 6 కోట్ల కస్టమర్లతో భారత్లో హోండా తిరుగులేని రికార్డు.. ఎక్కువగా వీటిపైనే క్రేజ్.!!
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
‘పుష్ప’ నుంచి మరో సర్ప్రైజ్: అప్పుడే నాలుగు పూర్తి.. అది కూడా అయిపోతే ఇక రచ్చే
ఫుల్ లెంగ్త్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా వచ్చిన 'అల.. వైకుంఠపురములో' మూవీతో గత ఏడాది ఇండస్ట్రీ హిట్ను తన ఖాతాలో వేసుకున్నాడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. ఈ రిజల్ట్ ఇచ్చిన జోష్లో ఉన్న అతడు.. ఆ వెంటనే మరో స్టార్ డైరెక్టర్ సుకుమార్తో కలిసి 'పుష్ప' అనే సినిమాను పట్టాలెక్కించేశాడు. గంథపు చెక్కల స్మగ్లింగ్ నేపథ్యంతో పాన్ ఇండియా రేంజ్లో రాబోతున్న ఈ మూవీపై అన్ని ఇండస్ట్రీలూ దృష్టి సారించాయి. మాస్ యాక్షన్ జోనర్లో రాబోతున్న ఈ సినిమాపై అంచనాలు భారీ స్థాయిలో ఉన్నాయి. అందుకు అనుగుణంగానే దీన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు.
అరాచకమైన ఫొటోలతో షాకిచ్చిన అమలా పాల్: బీచ్లో బికినీతో అందాలు మొత్తం కనిపించేంత ఘాటుగా!
క్రేజీ కాంబినేషన్లో భారీ బడ్జెట్తో రాబోతున్న 'పుష్ప' మూవీని రెండు భాగాలుగా విడుదల చేయబోతున్నారన్న విషయం తెలిసిందే. ఇప్పటికే మొదటి భాగానికి సంబంధించిన 90 శాతం షూటింగ్ పూర్తైంది. అలాగే, రెండో పార్ట్ కోసం దాదాపు 30 శాతం చిత్రీకరణ జరిపారు. ఇప్పుడు ఈ మూవీ బ్యాలెన్స్ పార్ట్ కోసం శరవేగంగా షూట్ చేస్తున్నారు. ఇక, మొదటి భాగాన్ని 'పుష్ప.. ద రైజ్' పేరిట వచ్చే క్రిస్టమస్కు ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నట్లు చిత్ర యూనిట్ ఇటీవలే ప్రకటించింది. దీంతో ఈ ప్రతిష్టాత్మక సినిమా కోసం బన్నీ ఫ్యాన్స్తో పాటు సినీ ప్రియులంతా ఆసక్తిగా ఎదురు చూస్తోన్నారు.
అల్లు అర్జున్ నటిస్తోన్న 'పుష్ప' సినిమా నుంచి కొద్ది రోజుల క్రితం 'Introducing Pushpa Raj' అనే వీడియోను విడుదల చేశారు. పూర్తి మాస్ ఎలిమెంట్స్తో రూపొందిన ఈ వీడియోకు ప్రేక్షకుల నుంచి విపరీతమైన స్పందన వచ్చింది. ఫలితంగా ఇది ఎన్నో రికార్డులను బద్దలు కొట్టేసింది. ఇక, ఇటీవలే ఈ సినిమాలోని ఫస్ట్ సింగిల్ విడుదలైంది. ఐదో భాషల్లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆ సింగిల్కు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. ఫలితంగా సౌత్లో ఎక్కువ వ్యూస్ రాబట్టిన పాటగా ఇది రికార్డులకెక్కింది. అలాగే, లైకులు కూడా భారీగానే సంపాదించుకుని ఈ పాట సత్తా చాటింది.
అందాలన్నీ చూపిస్తూ రెచ్చిపోయిన పవన్ హీరోయిన్: బట్టలు ఉన్నా లేనట్లే.. మరీ ఇంత దారుణంగానా!
ఈ క్రమంలోనే ఇప్పుడు 'పుష్ప' మూవీ నుంచి రెండో పాట కూడా రెడీ అవుతోంది. తాజా సమాచారం ప్రకారం.. డ్యూయెట్గా రాబోతున్న ఈ పాటకు సంబంధించిన రికార్డింగ్ పనులు ఎప్పుడో ప్రారంభం అయ్యాయట. అంతేకాదు, మ్యూజిక్ డైరెక్టర్ దేవీ శ్రీ ప్రసాద్ ఇప్పటికే నాలుగు భాషల్లో దీన్ని రికార్డింగ్ కూడా చేసేశాడని తెలుస్తోంది. మరో భాషలో కూడా ఇది పూర్తైన వెంటనే చిత్ర యూనిట్ అప్డేట్ ఇస్తుందట. ఆ వెంటనే ఈ పాటను విడుదల చేస్తారని తెలుస్తోంది. ఇక, ఇందులో దేవీ శ్రీ ప్రసాద్ మార్క్ మెలోడీ ట్యూన్ ఉండబోతుందనే టాక్ గట్టిగానే వినిపిస్తోంది. దీంతో ఈ సాంగ్ కోసం అంతా వేచి చూస్తున్నారు.
అల్లు అర్జున్ కెరీర్లోనే భారీ బడ్జెట్తో రాబోతున్న 'పుష్ప' మూవీలో అల్లు అర్జున్ గంథపు చెక్కల స్మగ్లర్గా నటిస్తున్నాడు. ఇందుకోసం అతడు ఎన్నో సాహసలు చేస్తున్నాడు. ఇక, ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. కన్నడ పిల్ల రష్మిక మందన్నా ఇందులో హీరోయిన్గా నటిస్తోంది. మలయాళ స్టార్ హీరో ఫహద్ ఫాసిల్ విలన్గా చేస్తున్నాడు. టాప్ మ్యూజిక్ డైరెక్టర్ దేవీ శ్రీ ప్రసాద్ దీనికి సంగీతం అందిస్తున్నాడు. హాట్ యాంకర్ అనసూయ భరద్వాజ్ ఇందులో కీలక పాత్రలో నటిస్తోంది. అలాగే, వర్ష బొల్లమ్మ కూడా నటిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.