Don't Miss!
- News రేవంత్ నన్ను జైల్లో వేస్తాడట..: కాంగ్రెస్ సర్కారుపై కేసీఆర్ నిప్పులు
- Sports DC vs GT: ఆ తప్పిదంతోనే ఓడిపోయాం: శుభ్మన్ గిల్
- Lifestyle పెళ్లైన వ్యక్తితో డేటింగా? కాస్త ముందు..వెనకా ఆలోచించండి..లేదంటే కొంప కొల్లేరే..!
- Technology OPPO Find X7 Ultra కెమెరా రివ్యూ! అద్భుతమైన ఫీచర్లతో, బెస్ట్ కెమెరా ఫోన్!
- Automobiles 323 కి.మీ రేంజ్తో ప్రీమియం ఎలక్ట్రిక్ బైక్ విడుదల.. ధర తెలిస్తే కొనేందుకు ఆలోచిస్తారు..!!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
ఆలస్యం కానున్న ‘పుష్ప’ షూటింగ్: పాడైపోయిన సెట్స్.. అసలు కారణం ఇదే
'అల.. వైకుంఠపురములో' వంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తోన్న చిత్రం 'పుష్ప'. లెక్కల మాస్టారు సుకుమార్ తెరకెక్కిస్తోన్న ఈ మూవీ గంథపు చెక్కల స్మగ్లింగ్ నేపథ్యంతో పూర్తి స్థాయి మాస్ యాక్షన్ ఎంటర్టైనర్గా రూపొందుతోంది. పాన్ ఇండియా రేంజ్లో వచ్చే ఈ సినిమా రెండు భాగాలుగా విడుదల కాబోతుంది. అందులో ఒక పార్టుకు సంబంధించి 80 శాతం, రెండో భాగానికి సంబంధించి దాదాపు 30 శాతం షూటింగ్ పూర్తైంది. ఇక, మిగిలిన దాన్ని కూడా వీలైనంత త్వరగా కంప్లీట్ చేయాలనుకున్నారు. ఈ నేపథ్యంలో ఓ షాకింగ్ న్యూస్ తెలిసింది.
'పుష్ప' మూవీ షూటింగ్ కోసం పర్ఫెక్ట్ ప్లాన్తో ముందుకు వెళ్లాలని చిత్ర యూనిట్ భావిస్తోంది. అందుకు అనుగుణంగానే హైదరాబాద్లో 45 రోజుల షెడ్యూల్ను మొదలు పెట్టాలని నిర్ణయించుకున్నారు. ఇందుకోసం కొన్ని సెట్లను కూడా ఏర్పాటు చేశారు. అయితే, తాజా సమాచారం ప్రకారం.. కొద్ది రోజులుగా హైదారబాద్ నగరంలో కురుస్తోన్న భారీ వర్షాలకు ఆ సెట్లు దెబ్బతిన్నాయట. దీని వల్ల షూటింగ్ ఆలస్యంగా మొదలయ్యే అవకాశం ఉందని తెలిసింది. అంతేకాదు, సెట్లు దెబ్బతినడం వల్ల కొంత ఆస్తి నష్టం కూడా జరిగినట్లు ఓ న్యూస్ ఫిలిం నగర్ ఏరియాలో వైరల్ అవుతోంది.
ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందుతోన్న 'పుష్ప'లో అల్లు అర్జున్ గంథపు చెక్కల స్మగ్లింగ్ ముఠాకు నాయకుడిగా నటిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్లు, టీజర్కు భారీ స్థాయిలో రెస్పాన్స్ వచ్చింది. ఇక, ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తోంది. ఇందులో కన్నడ పిల్ల రష్మిక మందన్నా ఇందులో హీరోయిన్గా నటిస్తోంది. మలయాళ హీరో ఫహద్ ఫాసిల్ విలన్గా చేస్తున్నాడు. అనసూయ కీలక పాత్రను పోషిస్తోంది. దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం సమకూర్చుతున్నాడు.