Don't Miss!
- News వీళ్లా..వైఎస్ వారసులు, పక్కన పెట్టింది ఇందుకే - షర్మిల పై జగన్ ఫైర్..!!
- Finance Stock Market: ప్లాట్ గా స్టాక్ మార్కెట్లు.. టెక్ మహీంద్రాలో భారీ కుదుపు..!
- Lifestyle ప్రపంచంలోనే అత్యంత పోషకమైన వేచూర్ ఆవు పాలు: గిన్నీస్ రికార్డ్ సాధించిన ఈ ఆవు గురించి ఆసక్తికరమైన విషయాలు
- Sports RCBకి గుడ్ న్యూస్: ప్లే ఆఫ్స్కు ఇలా ఈజీగా చేరొచ్చు!
- Automobiles కొత్త ఆస్టన్ మార్టిన్ వాంటేజ్ కూల్ స్పోర్ట్స్ కారు లాంచ్.. గంటకు 325 కి.మీ వేగం.. ధర, ఫీచర్లు ఇవే..
- Technology Nokia మాతృ సంస్థ HMD నుంచి మూడు కొత్త ఫోన్లు లాంచ్! ధర, స్పెసిఫికేషన్ల వివరాలు
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
ఆలస్యం కానున్న ‘పుష్ప’ షూటింగ్: పాడైపోయిన సెట్స్.. అసలు కారణం ఇదే
'అల.. వైకుంఠపురములో' వంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తోన్న చిత్రం 'పుష్ప'. లెక్కల మాస్టారు సుకుమార్ తెరకెక్కిస్తోన్న ఈ మూవీ గంథపు చెక్కల స్మగ్లింగ్ నేపథ్యంతో పూర్తి స్థాయి మాస్ యాక్షన్ ఎంటర్టైనర్గా రూపొందుతోంది. పాన్ ఇండియా రేంజ్లో వచ్చే ఈ సినిమా రెండు భాగాలుగా విడుదల కాబోతుంది. అందులో ఒక పార్టుకు సంబంధించి 80 శాతం, రెండో భాగానికి సంబంధించి దాదాపు 30 శాతం షూటింగ్ పూర్తైంది. ఇక, మిగిలిన దాన్ని కూడా వీలైనంత త్వరగా కంప్లీట్ చేయాలనుకున్నారు. ఈ నేపథ్యంలో ఓ షాకింగ్ న్యూస్ తెలిసింది.
'పుష్ప' మూవీ షూటింగ్ కోసం పర్ఫెక్ట్ ప్లాన్తో ముందుకు వెళ్లాలని చిత్ర యూనిట్ భావిస్తోంది. అందుకు అనుగుణంగానే హైదరాబాద్లో 45 రోజుల షెడ్యూల్ను మొదలు పెట్టాలని నిర్ణయించుకున్నారు. ఇందుకోసం కొన్ని సెట్లను కూడా ఏర్పాటు చేశారు. అయితే, తాజా సమాచారం ప్రకారం.. కొద్ది రోజులుగా హైదారబాద్ నగరంలో కురుస్తోన్న భారీ వర్షాలకు ఆ సెట్లు దెబ్బతిన్నాయట. దీని వల్ల షూటింగ్ ఆలస్యంగా మొదలయ్యే అవకాశం ఉందని తెలిసింది. అంతేకాదు, సెట్లు దెబ్బతినడం వల్ల కొంత ఆస్తి నష్టం కూడా జరిగినట్లు ఓ న్యూస్ ఫిలిం నగర్ ఏరియాలో వైరల్ అవుతోంది.
ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందుతోన్న 'పుష్ప'లో అల్లు అర్జున్ గంథపు చెక్కల స్మగ్లింగ్ ముఠాకు నాయకుడిగా నటిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్లు, టీజర్కు భారీ స్థాయిలో రెస్పాన్స్ వచ్చింది. ఇక, ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తోంది. ఇందులో కన్నడ పిల్ల రష్మిక మందన్నా ఇందులో హీరోయిన్గా నటిస్తోంది. మలయాళ హీరో ఫహద్ ఫాసిల్ విలన్గా చేస్తున్నాడు. అనసూయ కీలక పాత్రను పోషిస్తోంది. దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం సమకూర్చుతున్నాడు.