Don't Miss!
- News కేసీఆర్కు మరో షాక్: బీఆర్ఎస్కు కడియం శ్రీహరి, కావ్య గుడ్బై, వరంగల్ కాంగ్రెస్ ఎంపీగా బరిలో
- Sports RR vs DC: రఫ్ఫాడించిన ఆవేశ్ ఖాన్.. ఓడిపోయే మ్యాచ్లో గెలిచిన రాజస్థాన్ రాయల్స్!
- Lifestyle Love Horoscope For April 2024:ఈ రాశులకి ఏప్రిల్ లో LOVE సక్సెస్ అవుతుంది..మరికొందరికి అడ్డంకులు తప్పవు
- Technology రియల్మి కొత్త ఫోన్ టీజర్ విడుదల.. సెగ్మెంట్లోనే సన్నని డిజైన్ సహా కీలక ఫీచర్లు..!
- Automobiles 6 కోట్ల కస్టమర్లతో భారత్లో హోండా తిరుగులేని రికార్డు.. ఎక్కువగా వీటిపైనే క్రేజ్.!!
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
అల్లు శిరీష్ ‘ఎబిసిడి’ చిత్రానికి క్లీన్ సెన్సార్ సర్టిఫికెట్
అల్లు శిరీష్ హీరోగా నటిస్తున్న 'ఏబీసీడీ' మూవీ సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధమైంది. సెన్సార్ బోర్డు సభ్యులు ఈ చిత్రానికి క్లీన్ 'యు' సర్టిఫికెట్ జారీ చేశారు. మార్చి 17న విడుదల చేసేందుకు అన్ని ఏర్పాట్లు సిద్దం చేశారు.
సంజీవ్ రెడ్డి దర్శకుడిగా పరిచయమవుతున్న ఈ చిత్రంలో రుక్సార్ థిల్లాన్ హీరోయిన్. మెగా బ్రదర్ నాగబాబు ఇందులో అల్లు శిరీష్ కు తండ్రి పాత్రలో నటించారు. మాస్టర్ భరత్ హీరో ఫ్రెండ్ పాత్రలో కనిపించబోతున్నారు. సురేష్ బాబు సమర్పణలో బిగ్ బెన్ సినిమాస్ యశ్ రంగినేనితో కలిసి మధుర ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్లో మధుర శ్రీధర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
ఈ సినిమాలోని మెల్ల మెల్లగా సాంగ్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. సిద్ శ్రీరామ్ పాడిన ఈ పాటకు దాదాపు 25 లక్షల వ్యూస్ వచ్చాయి. ఇంతకు ముందు సిద్ శ్రీరామ్ తెలుగులో పలు సూపర్ హిట్ పాటలకు గాత్రం అందించాడు. టాక్సీవాలాలో అతడు పాడిన 'ఇంకేం ఇంకేం కావాలి' సాంగ్ 300 మిలియన్లకుపగా వ్యూస్ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే.
చిరంజీవినే ఎవరు మీరు అని ప్రశ్నించా.. ఆయన మాటలతో రోమాలు నిక్కబొడిచాయ్'
మలయాళంలో సూపర్ సక్సెస్ అందుకున్న ఏబీసీడీ చిత్రాన్ని తెలుగులో అదే పేరుతో రీమేక్ చేస్తున్నాం. అక్కడ దుల్కర్ పోషించిన పాత్రను తెలుగులో శిరీష్ పోషిస్తున్నారు. వాస్తవానికి ఈ చిత్రం మార్చిలోనే విడుదల కావాల్సి ఉండగా పలు కారణాలతో వాయిదా పడుతూ వచ్చింది. పలు వాయిదాల అనంతరం సినిమా రిలీజ్ డేట్ మార్చి 17న ఫిక్స్ చేశారు. కన్నడ మ్యూజిక్ డైరెక్టర్ జుధా సాంధీ సంగీతం సమకూరుస్తున్నారు.
అల్లు శిరీష్ నుంచి సినిమా వచ్చి దాదాపు రెండేళ్లయింది. 2017లో వచ్చిన 'ఒక్క క్షణం' బాక్సాఫీసు వద్ద ఆశించిన ఫలితాలు ఇవ్వలేదు. తాజాగా రీమేక్ మూవీ 'ఎబిసిడి' ద్వారా త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఇకపై సినిమా సినిమాకు గ్యాప్ రాకుండా తనకోసం మంచి స్క్రిప్టులు వెతికిపెట్టేందుకు ఒక టీంను నియమించుకున్నాడట.