Don't Miss!
- News లేడీ స్కూట్ టీచర్ ను ఎత్తుకెళ్లిన యువకుడు, జాతరకు వెళ్లిన టైమ్ లో ప్లాన్ చేసి, అంతేనా!
- Lifestyle చాణక్య నీతి : పొరపాటున కూడ భార్యకు ఈ 5 విషయాలు అస్సలు చెప్పకూడదు..!
- Sports CSK vs LSG: శతక్కొట్టిన రుతురాజ్ గైక్వాడ్.. చితక్కొట్టిన శివమ్ దూబే!
- Automobiles ఏథర్ రిజ్టా ఎలక్ట్రిక్ స్కూటర్కు పోటీగా ఆంపియర్ NXG.. ఆ రోజే లాంచ్
- Technology ధర రూ.10 వేల కంటే తక్కువ ధరకే రియల్మి 5G స్మార్ట్ఫోన్.. విడుదల తేదీ ఖరారు..!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లను లాగిన మెటల్ స్టాక్స్..
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
అల్లు శిరీష్ 'ఎబిసిడి' వాయిదా.. మరో మెగా హీరోతో పోటీ!
మెగా హీరో అల్లు శిరీష్ ఈ సారి 'ఎబిసిడి' అంటూ రాబోతున్నాడు. ఎబిసిడి అనేది మలయాళంలో ఘనవిజయం సాధించిన చిత్రం. ఈ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేస్తున్నారు. ఎబిసిడి.. అమెరికన్ బార్న్ కన్ఫ్యూజ్డ్ దేశీ అనేది ఉపశీర్షిక. ఈ చిత్రానికి రాజీవ్ రెడ్డి దర్శత్వం వహిస్తున్నారు. రుక్సార్ దిల్లోన్ ఈ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తోంది. శ్రీరస్తు శుభమస్తు చిత్రంతో విజయం అందుకున్న శిరీష్ తదుపరి చిత్రాల విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్నాడు.
మార్చి 21న విడుదల కావాల్సిన ఎబిసిడి చిత్రం వాయిదా పడ్డట్లు సమాచారం. పోస్టే ప్రొడక్షన్ కార్యక్రమాలు ఆలస్యం జరుగుతుండంతో నిర్మాతలు చిత్రాన్ని వాయిదా వేసినట్లు జరుగుతోంది. ఈ చిత్రాన్ని ఏప్రిల్ 12న విడుదల చేయనున్నట్లు వార్తలు వస్తున్నాయి. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఏప్రిల్ 12న విడుదల కావడం ఖరారైతే అల్లు శిరీష్ మరో మెగా హీరోతో పోటీ పడవలసి ఉంటుంది.
సాయిధరమ్ తేజ్ నటిస్తున్న చిత్రలహరి చిత్రం కూడా ఏప్రిల్ 12నే విడుదల కానుంది. మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన అల్లు శిరీష్ ఇంతవరకు టాలీవుడ్ లో తనదైన ముద్ర వేయలేదు. ఎబిసిడి చిత్రం తనకు మరింత గుర్తింపు తీసుకువస్తుందని శిరీష్ భావిస్తున్నాడు. మధుర శ్రీధర్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. జుడా శాండీ ఈ చిత్రానికి సంగీత దర్శకుడు.