అల్లు శిరీష్ ‘ఎబిసిడి’ రిలీజ్ డేట్ వాయిదా, ట్రెండింగ్లో సిద్ శ్రీరామ్ సాంగ్
అల్లు శిరీష్ హీరోగా నటిస్తున్న 'ఏబీసీడీ' చిత్రాన్ని మార్చి 1న విడుదల చేయబోతున్నట్లు కొన్ని రోజుల క్రితం అఫీషియల్ ప్రకటన విడుదల చేసిన సంగతి తెలిసిందే. కారణం ఏమిటో తెలియదు కానీ సినిమా రేపు విడుదల కావడం లేదు.

సంజీవ్ రెడ్డి దర్శకుడిగా పరిచయమవుతున్న ఈ చిత్రంలో రుక్సార్ థిల్లాన్ హీరోయిన్. మెగా బ్రదర్ నాగబాబు ఇందులో అల్లు శిరీష్ కు తండ్రి పాత్రలో నటించారు. మాస్టర్ భరత్ హీరో ఫ్రెండ్ పాత్రలో కనిపించబోతున్నారు. సురేష్ బాబు సమర్పణలో బిగ్ బెన్ సినిమాస్ యశ్ రంగినేనితో కలిసి మధుర ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్లో మధుర శ్రీధర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

కాగా.. ఈ సినిమాలోని మెల్ల మెల్లగా సాంగ్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. సిద్ శ్రీరామ్ పాడిన ఈ పాటకు దాదాపు 20 లక్షల వ్యూస్ వచ్చాయి. ఇంతకు ముందు సిద్ శ్రీరామ్ తెలుగులో పలు సూపర్ హిట్ పాటలకు గాత్రం అందించాడు. టాక్సీవాలాలో అతడు పాడిన 'ఇంకేం ఇంకేం కావాలి' సాంగ్ 300 మిలియన్ వ్యూస్ సొంతం చేసుకుంది.

మలయాళంలో సూపర్ సక్సెస్ అందుకున్న ఏబీసీడీ చిత్రాన్ని తెలుగులో అదే పేరుతో రీమేక్ చేస్తున్నాం. అక్కడ దుల్కర్ పోషించిన పాత్రను తెలుగులో శిరీష్ పోషిస్తున్నారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. త్వరలో న్యూ రిలీజ్ డేట్ ప్రకటించనున్నారు. కన్నడ మ్యూజిక్ డైరెక్టర్ జుధా సాంధీ సంగీతం సమకూరుస్తున్నారు.


Click it and Unblock the Notifications











