నిర్మాతగా మారిన అమలాపాల్.. మృతదేహం కథతో..
తమిళంలో హీరోయిన్గా రాణిస్తూ ప్రేక్షకుల మనుసు దోచుకొంటున్న అమలా పాల్ కొత్త అవతారం ఎత్తింది. వాస్తవ సంఘటనల ఆధారంగా చేసుకొని ఇటీవల ఓ దర్శకుడు చెప్పిన కథకు ఫిదా అయిన అమలాపాల్ నిర్మాతగా మారిపోయారు. అంతేకాకుండా ఈ చిత్రంలో కీలక పాత్రలో కూడా నటిస్తున్నారు.
తమిళనాడులో జరిగిన ఓ వాస్తవ సంఘటన ఆధారంగా కడవేర్ అనే సినిమా రూపొందిస్తున్నారు. ఈ చిత్రంలో ఫొరెన్సిక్ పాథాలిజిస్ట్గా అమల్ పాల్ నటిస్తున్నారు. ఈ సినిమాలో ఓ ముఖ్యమైన నేర విచారణకు పరిష్కారం చూపే పాత్రలో ఆమె కనిపిస్తారు. కడవెర్ అనగా మృతదేహం.

కేరళలో పోలీసు డిపార్ట్మెంట్లో ఓ వైద్య అధికారి చేపట్టిన కేసు ఆధారంగా ఈ సినిమాను రూపొందిస్తున్నారు. కొత్త దర్శకుడికి అవకాశం ఇవ్వాలనే ఉద్దేశంతో నిర్మాతగా మారాను అని అమలాపాల్ వెల్లడించింది.


Click it and Unblock the Notifications











