Don't Miss!
- News బీజేపీలో చేరిన నల్లమిల్లి రామకృష్ణా రెడ్డి: ఆ నియోజకవర్గం నుంచే పోటీ
- Sports CSK vs LSG: అతని వల్లే గెలిచే మ్యాచ్లో ఓడాం: రుతురాజ్ గైక్వాడ్
- Lifestyle ఈ 4 రాశుల వారు ఉత్తమ సెక్స్ భాగస్వాములు అవుతారు... వీరిని లైఫ్ పార్ట్నర్ గా పొందడం అదృష్టం!
- Automobiles ఏథర్ రిజ్టా ఎలక్ట్రిక్ స్కూటర్కు పోటీగా ఆంపియర్ NXG.. ఆ రోజే లాంచ్
- Technology ధర రూ.10 వేల కంటే తక్కువ ధరకే రియల్మి 5G స్మార్ట్ఫోన్.. విడుదల తేదీ ఖరారు..!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లను లాగిన మెటల్ స్టాక్స్..
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
16న కృష్ణంరాజు కుటుంబ సభ్యులను పరామర్శించనున్న అమిత్ షా
కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఈనెల 16, 17 తేదీల్లో హైదరాబాద్లో పర్యటించనున్నారు. తెలంగాణ విమోచన వజ్రోత్సవ వేడుకల్లో పాల్గొనేందుకు ఆయన హైదరాబాద్ వస్తున్నారు. 16 సాయంత్రం ప్రముఖ నటుడు కృష్ణంరాజు ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శిస్తారు. అనంతరం ప్రభాస్తో ప్రత్యేకంగా భేటీ అవనున్నారు. 17వ తేదీ ఉదయం పరేడ్ గ్రౌండ్స్ లో జరిగే విమోచన వజ్రోత్సవాలకు హాజరై జాతీయ జెండాను ఆవిష్కరిస్తారు.
కొద్దిరోజుల క్రితం మనుగోడు సభలో పాల్గొనేందుకు హైదరాబాద్ వచ్చిన అమిత్ షా సినీ నటుడు జూనియర్ ఎన్టీఆర్తో భేటీ అయిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ప్రభాస్తో భేటీ కానున్నారు. ఇందులో ఎటువంటి రాజకీయ కోణం లేదని, పెదనాన్న మృతితో బాధలో ఉన్న ప్రభాస్ను పరామర్శిస్తారని, అంతేకాకుండా కృష్ణంరాజు తమ పార్టీనేతేనని, ఆయన మృతదేహంపై పార్టీ జెండాను కూడా ఉంచామని బీజేపీ నేతలు తెలిపారు.
ప్రభాస్ పెదనాన్న కృష్ణంరాజు బీజేపీ నేతగా మృతిచెందడం, డార్లింగ్ పాన్ ఇండియా స్టార్ కావడం, తాజాగా శ్రీరాముడిగా ఆదిపురుష్ లో నటించడంలాంటివే కాకుండా ఆ పార్టీకి మరిన్ని రాజకీయ ప్రయోజనాలున్నాయని, అందుకే ప్రభాస్తో భేటీ అని సినీ, రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం విమోచన వజ్రోత్సవాలు నిర్వహిస్తోంది.
అధికార టీఆర్ఎస్ కన్నా ధీటుగా ఉండాలనే లక్ష్యంతో భారతీయ జనతాపార్టీ కూడా విమోచన వజ్రోత్సవాలు నిర్వహించడమే కాక కేంద్ర హోంమంత్రే స్వయంగా వస్తున్నారంటే తెలంగాణపై ఆ పార్టీ ఎంతగా దృష్టిసారించిందనే విషయం అర్థమవుతోందని భావిస్తున్నారు.