Don't Miss!
- Technology 6.9 అంగుళాల డిస్ప్లే, 64MP కెమెరా ఫోల్డబుల్ ఫోన్పై భారీ డిస్కౌంట్.. అమెజాన్ సేల్ పూర్తి వివరాలు..!
- News అనుభవజ్ఞుడైన నాయకుడు చంద్రబాబు: ప్రధాని మోదీ కితాబు.. సెలబ్రేషన్స్ ఇలా
- Finance API: ఫార్మా కంపెనీలకు శుభవార్త.. ఇక లాభాలే..!
- Sports ముంబై ఇండియన్స్కు బిగ్ షాక్: ఆ ఇద్దరికీ కోత
- Lifestyle లివర్ వ్యాధి లక్షణాలు ఇవే.. వెంటనే అప్రమత్తం కావాలి..
- Automobiles హ్యుందాయ్ ఎక్స్టర్ దిమ్మ తిరిగే మైలేజ్.. ఓనర్ ఫుల్ ఖుష్.. ఫొటోలతో సహా ప్రూఫ్ ఇదిగో.!!
- Travel తెలంగాణ టూరిజం.. హైదరాబాద్ టు షిర్డీ ఫ్లైట్ టూర్ ప్యాకేజీ..
Prabhas: నాగ్ అశ్విన్ పాన్ ఇండియా... అప్పుడే రంగంలోకి దిగిన అగ్ర నటుడు!
RRR అనంతరం బిగ్గెస్ట్ పాన్ ఇండియా మూవీగా రూపొందుతున్న సినిమాల్లో ప్రభాస్ 21 ఒకటి. సినిమాను హాలీవుడ్ రేంజ్ లోనే ప్లాన్ చేస్తున్నారు. ఎన్నో ఏళ్ల చరిత్ర ఉన్న వైజయంతి ప్రొడక్షన్ నుంచి వస్తున్న అత్యంత భారీ బడ్జెట్ సినిమా కావడంతో నేషనల్ వైడ్ గా సినిమాకు హైప్ క్రియేట్ అయ్యింది. సైన్స్ ఫిక్షన్ అనగానే బాలీవుడ్ కోలీవుడ్ ఇండస్ట్రీలో కూడా సినిమా పై అంచనాలు పెరిగిపోయాయి.
ఇక సినిమా క్యాస్టింగ్ అప్పుడే అందరి ఫోకస్ సినిమాపై పడింది. ప్రభాస్ కు జోడిగా దీపికా పదుకొనెను ఫిక్స్ చేసిన విషయం తెలిసిందే. ఇక సినిమాలో అమితాబ్ బచ్చన్ కూడా ఒక మంచి పాత్రలో నటిస్తున్నారు. మొదట గెస్ట్ రోల్ అని రూమర్స్ వచ్చాయి. కానీ ఆయన చేసేది గెస్ట్ రోల్ కాదని ఫుల్ లెన్త్ రోల్ అని దర్శకుడు నాగ్ అశ్విన్ ఇదివరకే పలుమార్లు క్లారిటీ ఇచ్చాడు. గత ఎడాది నుంచి దర్శకుడు తన టెక్నీషియన్స్ తో కలిసి వర్క్ షాప్ తో బిజీబిజీగా కనిపిస్తున్నాడు. ఇక సినిమాకు సంబంధించిన అసలైన షూటింగ్ పనులు కూడా స్టార్ట్ అయినట్లు తెలుస్తోంది.
ఇక శనివారం అమితాబ్ బచ్చన్ మొదటిసారి చిత్ర యూనిట్ తో కలవబోతున్నట్లు సమాచారం. 10రోజుల వరకు హైదరాబాద్ లోనే ఉండనున్న బిగ్ బి వీలైతే 7రోజుల్లోనే షెడ్యూల్ ను ఫినిష్ చేసుకోవాలని అనుకుంటున్నాడు. ఎక్కడా తగ్గకుండా నిర్మాత సి.అశ్వినిదత్ 500కోట్ల భారీ బడ్జెట్ తో ఈ మూవీని నిర్మించనున్నారట. హాలీవుడ్ లో ఎదో నామమాత్రంగా రిలీజ్ చేయకుండా భారీ స్థాయిలో ప్రమోషన్ చేయాలని కూడా అనుకుంటున్నారు. మరి వైజయంతి ఆ స్థాయిలో సినిమాకు హైప్ క్రియేట్ చేస్తుందో లేదో చూడాలి.