Don't Miss!
- News సీఎం పదవి ఊడిపోతుంది, మేము కొట్లాడుకుంటే మీ పార్టీ అధికారంలోకి వచ్చింది, ఈగనోడి !
- Lifestyle సమ్మర్ బ్లాక్ బస్టర్ రిసిపి మ్యాంగో చికెన్ కర్రీ..!ఒక్కసారి రుచి చూస్తే మళ్లీ మళ్లీ తినాలనిపిస్తుంది
- Finance Amitabh Kant: 2047 నాటికి 35 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా భారత్..
- Sports తలతిక్క నిర్ణయాలు: ఆ టీమ్కు అసలు సెన్స్ ఉందా: మాజీ లెజెండ్ ఫైర్
- Automobiles ముంబయి- అహ్మదాబాద్ బుల్లెట్ ట్రైన్ కోసం ‘బాలస్ట్లెస్' ట్రాక్.. దీని ప్రత్యేకతలు తెలుసా.??
- Travel గుడ్ప్రైడే రోజున లాంగ్వీకెండ్ ప్లాన్ చేస్తున్నారా? అయితే ఈ ప్లేస్లు చూసేయండి...
- Technology వాట్సాప్ కాలింగ్ ఫీచర్ వినియోగిస్తున్నారా.. అయితే ఈ అప్డేట్ మీకోసమే..!!
మద్యం మత్తులో యువత చేసే పొరపాట్లు.. సందేశాత్మక చిత్రంగా ‘అమృత నిలయం’
విజయ్, మమత, రిషివర్మ, సుహాసన ప్రధాన పాత్రధారులుగా నటిస్తున్న చిత్రం 'అమృత నిలయం'. రాజా విక్రమ నరేంద్ర దర్శకుడు. ఆర్.పి సమర్పణలో అను ఫిల్మ్ బ్యానర్పై రామమోహన్ నాగుల, ఎం.ప్రవీణ్ కుమార్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాల్లో ఉంది.
దర్శకుడు మాట్లాడుతూ... ప్రస్తుత సమాజంలో యువత తాగిన మైకంలో వారు చేసే పొరపాట్ల వల్ల చాలా కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. అలాంటి కుటుంబాల్లో ఓ అంధుడి జీవిత కథ ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాం అని అన్నారు.
నిర్మాతలు మాట్లాడుతూ... వైజాగ్లో ఎక్కువ శాతం షూటింగ్ చేశాం. సింగిల్ షెడ్యూల్లో సినిమా పూర్తయింది. నిర్మాణానంతర కార్యక్రమాలు తుదిదశలో ఉన్నాయి. సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసి సినిమాను విడుదల చేస్తాం అని తెలిపారు.
సమాజానికి సందేశాన్ని అందించే ఈ చిత్రానికి కథ, మాటలు: రవినాయక్, సంగీతం: రాం, పీఆర్వో: వీఆర్ మధు.